హైదరాబాద్ : వరంగల్ అర్బన్ జిల్లా నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం పరిశీలించారు. ఈ నెల 21న వరంగల్ జిల్లా పర్యటనకు రానున్న సీఎం కేసీఆర్ కలెక్టరేట్ను ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. 24 అంతస్తుల్లో నిర్మించ తలపెట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానకు సైతం సీఎం శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. ప్రతి జిల్లాలో సకల వసతులతో రూ. 57 కోట్లతో కలెక్టరేట్ సముదాయం నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి దయాకర్ రావు పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.