హనుమకొండ, జనవరి 28 : విభజన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకుండా.. అసత్యాలు, అబద్ధా లు ప్రచారం చేస్తూ కాలంగడుపుతున్న బీజేపీని ప్రజ లు నమ్మే పరిస్థితుల్లో లేరని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం హనుమకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయం(ఆర్అండ్బీ గెస్ట్హౌస్)లో చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. గతంలో వరంగల్ లో, హైదరాబాద్లో వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను సందిర్శించిన ఆ నాయకులు ప్రజలకు ఏం చేశారని ఎర్రబెల్లి ప్రశ్నించారు. బయ్యారానికి వెళ్లి ఈటల రాజేందర్ను అడ్డుకొని ఉక్కు ఫ్యాక్టరీ ఏదని నిలదీశారని, అలాగే నిజామాబాద్లో సైతం ఎంపీ అర్వింద్ ప్రజల ఆగ్రహానికి గురయ్యారని గుర్తుచేశారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇలా విభజన చట్టంలోని ఏ ఒక్క హామీ ని నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కు రావాల్సిన నిధులు మంజూరు చేయడం లేదని, ప రిశ్రమలను ప్రైవేట్పరం చేయాలని ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ను జైల్లో వేస్తామని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని.. మరి 2కోట్ల ఉద్యోగాలిస్తామని, అందరి బ్యాంకు ఖాతాల్లో రూ.15లక్షలు జమచేస్తామని ప్రజలను మోసం చేసిన మోదీని ఏ జై ళ్లో పెట్టాలని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు, మేడా రం జాతరకు జాతీయ హోదా ఏమైందని మంత్రి నిలదీశారు. తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నా యకత్వంలోనే రైతులకు ఊరట కలిగిందన్నారు. ఎస్సీ ల వర్గీకరణ, రిజర్వేషన్ల విషయంలో అసెంబ్లీలో తీ ర్మానం చేసి కేంద్రానికి పంపినా కేంద్రం స్పందించడం లేదన్నారు. ఇక్కడ అమలు చేస్తున్న పథకాలను దేశంలోని ఇతర రాష్ర్టాల్లో అమలుచేయాలని చూస్తున్నారన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిన బీజేపీ సిగ్గులేకుండా మాట్లాడుతున్నదన్నారు. చట్టాలను రైతు లు వ్యతిరేకించడం వల్లే వెనక్కి తీసుకున్నారన్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలకు కేంద్రంలోని బీజేపీ చేసిందేమీలేదన్నారు. కేసీఆర్, కేటీఆర్లపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని, ఇప్పటివరకు సహనంతో ఉన్నామని, ఇక ఓపిక పట్టే ప్రసక్తి లేదని మంత్రి ఎర్రబెల్లి హెచ్చరించారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికైనా పిచ్చి మాటలు మానుకోవాలని హితవు పలికా రు. అభివృద్ధి ఎజెండాతోనే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకొనే రోజులు వచ్చాయని మంత్రి స్పష్టంచేశారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు
రాష్ట్రంలో సమర్థవంతమైన పాలన అందించేందు కు గాను జిల్లా అధ్యక్షులను, కమిటీల నియమించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జనగామ, హనుమకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణాలు పూర్తయ్యాయని, త్వరలోనే వరంగల్ జి ల్లా పార్టీ కార్యాలయంతో పాటు కలెక్టరేట్ నిర్మించనున్నామని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుల నియామకంతో పార్టీ బలోపేతం అవుతుందన్నారు. ప్రతి కార్యకర్తకు గుర్తింపు వచ్చేలా ప్రణాళిక రూపొందించామన్నారు.
కేసీఆర్ ఇజాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్తా..