సూర్యాపేట: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం కందువారిగూడెంలో అనాగరిక చర్య చోటుచేసుకున్నది. ఆస్తుల పంపకాల్లో వివాదం తలెత్తడంతో తల్లికి అంత్యక్రియలు చేయకుండా కొడుకు, కూతుళ్లు వదిలేశారు. కందులవారిగూడానికి చెందిన లక్ష్మమ్మ రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. అంత్యక్రియలు నిర్వహించి పున్నామ నరకం నుంచి బయటపడేయాల్సిన కుమారుడు, కూతుళ్లు.. లక్ష్మమ్మ పేరుతో ఉన్న ఆస్తుల పంపకంలో వివాదం తలెత్తడంతో పట్టించుకోకుండా వదిలేశారు.
రెండు రోజులు గడుస్తున్నా ఇంట్లో నుంచి ఆమె మృతదేహాన్ని అలానే ఉంచారు. ఆస్తుల పంపకం విషయం తేలేవరకు అంత్యక్రియలు జరగడానికి వీళ్లేదంటూ కుటుంబ సభ్యులు భీష్మించుకు కూర్చున్నారు.