సుబేదారి, ఫిబ్రవరి 28 : శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం భవిష్యత్కు పునాది వంటిదని జిల్లా విద్యాశాఖ అధికారి బీ రంగ య్య నాయుడు అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా హంటర్రోడ్డులోని సైన్స్ రీజినల్ సెంటర్లో సోమవా రం వరంగల్, హనుమకొండ జిల్లాల విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్రలేఖనం, క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతు లు అందజేశారు. ఈ సందర్భంగా డీఈవో రంగయ్యనాయుడు మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతోందన్నారు. విద్యార్థులు సైన్స్పై నైపుణ్యాలకు పదునుపెట్టాలని సూచించారు. వరంగల్ డీఈవో వాసంతి మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. నిట్ ప్రొఫెసర్ డాక్టర్ కాశీనాథ్ శాస్త్ర సాంకేతిక రంగ సమీకృత విధానం ద్వారా సుస్థిర అభివృద్ధి అనే అంశంపై ప్రసంగించారు. కార్యక్రమంలో సైన్స్ సెంటర్ అధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్, క్వాలిటీ కోఆర్డినేటర్ ఏ శ్రీనివాస్, లయన్స్ క్లబ్ ట్రైసిటీ అధ్యక్షుడు నరసింహారెడ్డి పాల్గొన్నారు. అలాగే, నక్కలగుట్ట షైన్ స్కూల్లో జాతీయ సైన్స్ దినోతవ్సవాన్ని నిర్వహించారు. విద్యార్థులు 69 రకాల ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. విద్యాసంస్థల చైర్మన్ ఎం కుమార్, స్కూల్ డైరెక్టర్ వేణు, పైమరీ కరస్పాండెంట్ రమ, ప్రిన్సిపల్ రాజ్కుమార్ పాల్గొన్నారు.
బాలరక్ష సదన్లో..
వరంగల్ : సుబేదారిలోని బాలరక్ష సదన్లో బాలల సంక్షేమ అధికారి అధ్యక్షతన నిర్వహించిన సైన్స్ దినోత్సవం కార్యక్రమంలో పర్యావరణవేత్త, బాలల సంక్షేమ సమితి సభ్యుడు దామోదర్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రొటెక్షన్ అధికారి మౌనిక, విజయ్కుమార్ పాల్గొన్నారు.
భీమదేవరపల్లి మండలంలో..
భీమదేవరపల్లి : జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని వంగరలోని పీవీ రంగారావు బాలికల గురుకుల పాఠశాల, మాణిక్యాపూర్లోని ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన వస్తువుల గురించి సందర్శకులకు వివరించారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్లు అనపురం రమేశ్, భిక్షపతి, ప్రభాకర్రెడ్డి, హెచ్ఎంలు సురేఖ, శ్యాంసుందర్రెడ్డి, ఉపాధ్యాయులు సుధారాణి, భార్గవి, సుచరిత, ఆఫ్రీన్ సుల్తానా, సుధాకర్, మరియ వసంత, మహేశ్, కృష్ణవేణి, చాంద్పాషా, నళిని, శ్రీనివాస్, అనిల్, రజినీకాంత్, మౌనిక, మమత పాల్గొన్నారు.
ఎల్లాపూర్లో..
హసన్పర్తి : గ్రేటర్ 65 డివిజన్ ఎల్లాపూర్లోని ఆర్బిట్ పాఠశాలలో నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనను కరస్పాండెండ్ చిట్టిరెడ్డి భగవాన్రెడ్డి ప్రారంభించారు. ఉపాధ్యాయులు హారిక, వెంకట్రెడ్డి, సా రంగపాణి, విక్రమ్ వాసుదేవరెడ్డి, గంగా, ఆఫ్రీన్, వహిదాబేగం, స్రవంతి, సతీశ్, మధుకర్, వెంకటేశ్, రాకేశ్, ప్రశాంత్ పా ల్గొన్నారు. అలాగే, శ్రీ చైతన్య పాఠశాలలో సైన్స్ ఫెయిర్ను ఎస్సై విజయ్కుమార్ ప్రా రంభించారు. పాఠశాల చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్లు మహేశ్, రాజు, ప్రిన్సిపాల్ సురేశ్కుమార్, డీన్ రాజు, సాధన పాల్గొన్నారు.
నడికూడలో..
నడికూడ : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో సైన్స్ ప్రాముఖ్యతను హెచ్ఎం పట్టాభి వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సునీత, నర్సయ్య, వెంకటేశ్వరరావు, పుష్ప, రాజ్ మహ్మద్, జయ, తిరుపతయ్య, రజిత, అనిత పాల్గొన్నారు.
మర్కజీ స్కూల్లో..
హనుమకొండ చౌరస్తా : హనుమకొండ మర్కజీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో హెచ్ఎం మందాడి ఉమ పాల్గొని మాట్లాడారు. బాలలంతా బావి శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఈ శ్రీనివాస్, వీ సారంగపాణి, పీ శ్రీదేవి, జ్యోతికుమారి, అరుణకుమారి, వేణుగోపాల్, ఎండీ అన్వర్ పాల్గొన్నారు.
ఎల్బీ కళాశాలలో..
ఎల్బీ కళాశాల పీజీ సెంటర్లో జాతీయ సైన్స్డే వేడుకలు నిర్వహించారు. హైదరాబాద్ ఐఐసీటీ డాక్టర్ శ్రీహరి పబ్జరాజు, ఎస్ఆర్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ పీవీ రాజశేఖర్ పాల్గొన్నారు. విద్యార్థులు తమ ఎగ్జిబిట్స్, పోస్టర్లను ప్రదర్శించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ, డాక్టర్ ఎన్ పద్మజ, డీ నాగరాజు, డీ వినయ్, డీ కృష్ణ, పాల్గొన్నారు. అలాగే, హనుమకొండ కిషన్పురలోని శ్రీచైతన్య పాఠశాలలో విద్యార్థులు 150 సైన్స్ ప్రాజెక్టులు, వర్కింగ్ మోడల్స్ ప్రదర్శించారు. ముఖ్యఅతిథిగా డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ వాణిశ్రీ పాల్గొని ఎగ్జిబిట్లను తిలకించారు. పాఠశాలల ఛైర్మన్ మల్లంపాటి శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, డీజీఎం చేతన్, ఆర్ఐ రమేశ్, మహేశ్, ప్రిన్సిపాల్ వినయ్రెడ్డి, డీన్ సైదయ్య, ప్రైమరీ కోఆర్డినేటర్ సరిత, ఇన్చార్జి ప్రణీత, ఏవో రాకేశ్ పాల్గొన్నారు.
ఓగ్లాపూర్లో..
దామెర : మండలంలోని ఓగులాపురం సమీపంలోని డిస్నీల్యాండ్ ఇంటర్నేషనల్ స్కూల్లో పలు సైన్స్ ఎగ్జిబిట్స్ను ప్రదర్శించారు. కరస్పాండెంట్ శోభారాణి, డైరెక్టర్లు రాకేశ్భాను డీ దినేశ్చందర్ పాల్గొని ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన విద్యార్థులను అభినందించారు. ఉపాధ్యాయులు మధు, శివాజి, రాజిరెడ్డి పాల్గొన్నారు.
పరకాలలో..
పరకాల : పట్టణంలోని శారద విద్యాలయం హై స్కూల్లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ను ఎస్సై ప్రశాంత్బాబు ప్రారంభించారు. కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ మార్క సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్ ఇందిరాదేవి ఆధ్వర్యంలో సైన్స్డే నిర్వహించారు. ప్రభుత్వ బాలికల (సక్సెస్) పాఠశాలలో హెచ్ఎం మాధవి ఆధ్వర్యంలో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వేలేరులో..
వేలేరు : మండలంలోని కన్నారం, వేలేరు, పీచర, మల్లికుదుర్ల, ఎర్రబెల్లి గ్రా మాల పాఠశాలల్లో నిర్వహించిన క్విజ్ పో టీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో హెచ్ఎంలు వీ శ్రీనివాస్, మహిపాల్ పట్నాయక్, దుర్గాభవాని, నవీన్కుమార్, మహేశ్నాయక్, అజయ్కుమార్, స్రవంతి, ఉపాధ్యాయు లు శ్రీను, విద్యానంద్, వీరయ్య, శ్రీనివాస్, మాధవి, మన్మోహన్ పాల్గొన్నారు.
సోమిడిలో..
కాజీపేట : సోమిడి శివారులోని తాళ్ల పద్మావతి ఒలింపియాడ్ స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. స్కూల్ డైరెక్టర్ తాళ్ల వంశీ ముఖ్య అతిథిగా ప్రదర్శనను ప్రారంభించారు. కార్యక్రమంలో తాళ్ల మల్లేశం, ప్రిన్సిపాల్ చైతన్య, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
శాయంపేట మండలంలో..
శాయంపేట : మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భం గా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్స్ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.