హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 7: మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు ఆర్టీసీ సన్నద్ధ మైందని హైదరాబాద్, కరీంనగర్ జోన్ల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మునిశేఖర్ తెలిపారు. సోమవారం హనుమ కొండలోని ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 13 నుంచి 20వ తేదీ వరకు జాతరకు ప్రత్యే కంగా 3845 బస్సులు నడుపనున్నట్లు, ఇందులో వరంగల్ రీజియన్ నుంచి 2250 బస్సులు ఉన్నాయ ని చెప్పారు. రంగారెడ్డి నుంచి 150, కరీంనగర్ నుంచి 530, ఆదిలాబాద్ నుంచి 320, ఖమ్మం నుంచి 345, సికింద్రాబాద్(వరంగల్ రీజియన్ ఏడు పాయింట్లు) 200, మెదక్(హుస్నాబాద్) నుంచి 50 బస్సులు ఏ ర్పాటు చేసినట్లు తెలిపారు. గత జాతరలో 19,23,00 మంది భక్తులను మేడారానికి చేరవేసినట్లు తెలిపారు. ఈ జాతరలో 54 వేల ట్రిప్పులు, 66 లక్షల కిలోమీట ర్లు, 21 లక్షల మంది ప్రయాణికులను తరలించేందు కు ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 51 పాయింట్ల నుంచి భక్తులను తరలించేందుకు ప్రత్యేక చర్యలు చేప డుతున్నట్లు చెప్పారు. వరంగల్ నగరంలో మూడు పా యింట్స్(హయగ్రీవాచారి మైదానం, ఫ్రూట్ మార్కెట్, కాజీపేట రైల్వేస్టేషన్) నుంచి 900 బస్సులు నడిపించ నున్నట్లు వివరించారు. పోలీసుల సహకారంతో పస్రా, తాడ్వాయి, మేడారంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలి పారు. ఆర్టీసీ బస్సులు మేడారం వరకు వెళ్తాయని, ప్రై వేట్ వాహనాలు నార్లాపూర్ వరకు మాత్రమే వెళ్తాయ ని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే భక్తులు అమ్మవార్ల గద్దెల వరకు వెళ్లవచ్చని, అక్కడి నుంచి జంపన్నవాగు వరకు 25 మినీ బస్సులు నడుపనున్నట్లు తెలిపారు. మేడారంలో 50 ఎకరాల్లో బేస్క్యాంపు, 42 క్యూలైన్ల లో సెక్యూరిటీ కోసం మూడు, ప్రయాణికుల కోసం 39 క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 12, 200 మంది ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని, 8 వేల మంది డ్రైవర్లు, 3 వేల మంది కండక్టర్లు, ఇతర సి బ్బందిని కేటాయించినట్లు చెప్పారు. 2 వేల మంది రాత్రింబవళ్లు విధులు నిర్వర్తిస్తారని, వారి కోసం ప్రత్యే కంగా రెస్ట్రూం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆర్టీసీ సిబ్బంది కోసం సబ్సిడీతో క్యాంటీన్ ఉంటుందని చెప్పారు. బేస్క్యాంపులోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు, సీసీ కెమెరాల ద్వారా 24 గంటలు అధికారులు పర్యవేక్షిస్తారన్నారు. మూడు అంబులెన్స్ లతో మెడికల్ సెంటర్, ఫైరింజన్, మెకానికల్ షెడ్ కూడా ఏర్పాటు చేశామన్నారు. దర్శనం చేసుకుని వచ్చే భక్తుల కోసం సేద తీరడానికి స్థలాన్ని కేటాయించినట్లు చెప్పారు. బేస్క్యాంపు వద్ద టికెట్లు ఇవ్వరని, తాడ్వా యి దగ్గర టిక్కెట్లు ఇస్తామని, అందుకోసం 250-300 మంది కండక్టర్లు ఉంటారని చెప్పారు. మార్గ మ ధ్యంలో బస్సులకు అంతరాయం కలిగితే స్పేర్ పార్ట్స్ తో కూడిన 11 మొబైల్ వ్యాన్స్ అందుబాటు ఉంచా మన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్కు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. తిరుగు ప్రయాణంలో ములుగురోడ్ క్రాస్ వద్ద టికెట్ చూపిస్తే వరంగల్, హనుమకొండ, కాజీపే టకు ఉచితంగా వెళ్లేందుకు అనుమతిస్తామని తెలిపా రు. డీజిల్ చార్జీలు, ఇతర నిర్వహణ ఖర్చులు పెరిగినా టికెట్ చార్జీలు పెంచలేదని, పాత ధరలే ఉన్నాయని వివరించారు. కరోనా నేపథ్యంలో బస్సులకు శానిటైజే షన్ చేస్తామని, భక్తులు కూడా తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. 11వ తేదీ వరకే 30 మంది ఉన్న ఇంటికి బస్సు సౌకర్యం ఉంటుందని ఈడీ మునిశేఖర్ తెలిపారు. సమావేశంలో వరంగల్ ఆర్ఎం డీ విజయ్భాస్కర్, హైదరాబాద్ స్టోర్స్ చీఫ్ కంట్రోలర్ విజయ్కుమార్, హైదరాబాద్ రీజినల్ మేనే జర్ వెంకన్న, డివిజన్ల మేనేజర్లు వీ శ్రీదేవి, టీ శ్రీనివా సరావు, కిరణ్కుమార్ పాల్గొన్నారు.