పర్వతగిరి : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ సూచించారు. బుధవారం హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో పర్వతగిరి మండల నూతన ప్రధాన, యువజన విభాగం కమిటీల సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీని గ్రామ స్థాయిలో పటిష్టంగా బలోపేతం చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. సంస్థాగతంగా పార్టీని కాపాడుకుంటూ పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు దక్కుతున్నాయన్నారు.
పార్టీ పట్ల విధేయతతో పనిచేసిన వారికి మాత్రమే అవకాశాలు వస్తాయని, ప్రభుత్వం చేస్తున్న పనులను గ్రామీణ స్థాయిలో ప్రజల వద్దకు చేర్చేలా పనిచేయాలని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రంగు కుమార్, యూత్ ఉపాధ్యక్షుడు చింతకుంట్ల రంజిత్ పాల్గొన్నారు.