KCR | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో హంగ్ రాబోతుందని.. అందులో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించబోతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. వరంగల్, హన్ముకొండలో ఆయన రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. ‘ఈ రోజు ప్రచారం డంబాచారం. నరేంద్ర మోదీకి కూడా 200 సీట్లు దాటే పరిస్థితి లేదు. రోజూ పేపర్లలో వార్తలు వస్తున్నయ్. ఈ మోఖాలో ఇవాళా.. తెలంగాణలో పార్లమెంట్ సీట్లన్నీ మనమే గెలిస్తే పేగులు తెగేదాకా కొట్లాడే ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 14-15 ఎంపీలతో మనంపోతే.. కేంద్రంలోని హంగ్ పార్లమెంట్ వస్తే కీలకమైన పాత్ర పోషించే అవకాశం తెలంగాణకు ఈ రోజు ఉంది. మన గోదావరి కాపాడుకోవాలన్నా.. కృష్ణా నది కాపాడుకోవాలన్నా.. తెలంగాణకు రావాల్సిన నిధులు రాబట్టుకోవాలన్నా.. మన ప్రాజెక్టులకు జాతీయ హోదా రావాలన్నా.. నిరుద్యోగ సమస్య తీరాలన్నా.. మన బతుకులు బాగుపడాలన్నా.. ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలి. అదే క్షేమం’ అన్నారు.
‘రైతుబంధు పోయిందా? కరెంటు బంద్ అయ్యిందా? కోతలు వచ్చినయా? వడ్లు కొంటున్నరా? బోనస్ ఇస్తున్నారా? బోనస్ బోగస్ అయ్యిందా? ఇవన్నీ మోసాలు చేసిన తర్వాత గోదావరి ఎత్తుకుపోతా అనే బీజేపీకి గానీ.. వాగ్ధానాలను భంగం చేసిన కాంగ్రెస్కు ఓటేస్తే ఏమైతది ? మేం అన్నీ మోసం చేసినా.. మళ్లీ మాకే ఓటేశారని అన్నీ పండవెడుతరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాలి. ఇవాళ తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్కు పంచాయితీ పడ్డది. ప్రజల తరఫున పొట్లాడే పంచు ఎవరు? పోయిన ఎలక్షన్ల కిందపడగొట్టి.. మళ్లీ ఇప్పుడు పంచుకమ్మంటరు. నేనేనా? బీఆర్ఎస్సేనా? కొట్లాడుదామా? యుద్ధం చేద్దామా? గోదావరిని కాపాడుకుందామా? కృష్ణాను కాపాడుకుందామా? మళ్లీ బీఆర్ఎస్ గవర్నమెంట్లాగా రైతుబంధు ఇచ్చుకుందామా? కంటి నిండా కరెంటును తెచ్చుకుందామా? ఇది జరగాలంటే సుధీర్కుమార్ గెలవాలి. మీరు నాకిచ్చే బలంతోనే కదా? కొట్లాడేది’ అన్నారు.