సంగెం: సంగెం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ గోపి అభినందించారు. భారత ప్రభుత్వ ఆధీనంలోని జాతీయ పత్తి సంస్థ(సీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, వకృత్వం, డ్రాయింగ్, క్విజ్ పోటీల్లో సంగెం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు గెలుపొందినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ తెలిపారు. హోటల్ కాకతీయలో నిర్వహించిన విజిలెన్స్ వారోత్సవాల ముగింపు సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన కలెక్టర్ గోపి వీణ, నాగేశ్వరి, విల్సన్, శ్రీకాంత్, పండు, చరిత, ఈశ్వర్, వెన్నెల,చందు, అశ్విని, అఖిల, హరీష్లను అభినందించి ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులు అందజేశారు.