గ్రేటర్కు ఎల్ఈడీ సొబగులు
ఇప్పటికే 67వేల వీధి దీపాల ఏర్పాటు
మరో 5వేల లైట్లు, 2,608 స్తంభాలు బిగిస్తే వంద శాతం
మూడు నెలల్లో పూర్తి చేసే దిశగా అధికారులు
కొత్త కాలనీలు, విలీన గ్రామాల్లో సర్వే షురూ
నెలకు రూ.35లక్షల విద్యుత్ బిల్లు ఆదా
వరంగల్, ఆగస్టు 21 :వరంగల్ మహానగర ప్రధాన రహదారులు ఎల్ఈడీ వెలుగులతో జిగేల్ మంటున్నాయి. గతానికి భిన్నంగా పూర్తి స్థాయిలో ఎల్ఈడీ వీధి దీపాలను వినియోగిస్తుండడంతో విద్యుత్ బిల్లు రూ. లక్షల్లో ఆదా అవుతున్నది. రోజురోజుకూ విస్తరిస్తున్న నగరంలో వీధి దీపాల సంఖ్య పెరుగుతున్నా విద్యుత్ బిల్లు గతంతో పోలిస్తే సగానికి పైగా తగ్గింది. అవసరమున్న చోట కొత్త స్తంభాల ఏర్పాటుకు గ్రేటర్ కార్పొరేషన్ అధికారులు ట్రాన్స్కోతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరో మూడు నెలల్లో వంద శాతం ఎల్ఈడీ లైట్ల బిగింపు కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రస్తుతం 67 వేల ఎల్ఈడీ వీధి దీపాలు ఉన్నాయి. 66 డివిజన్లో వంద శాతం ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో గ్రేటర్ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరో 5 వేల లైట్లు, 2608 కొత్త స్తంభాలు ఏర్పాటు చేస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్ కార్పొరేషన్ వద్ద 4,900 లైట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. కొత్త కాలనీపై దృష్టి సారించనున్నారు. దీంతో పాటు గ్రేటర్లోని అన్ని శ్మశాన వాటికలు, అప్రోచ్ రోడ్లలో ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
తగ్గిన విద్యుత్ బిల్లులు..
ఎల్ఈడీ లైట్ల వినియోగంతో గ్రేటర్ కార్పొరేషన్కు పెద్ద ఎత్తున విద్యుత్ బిల్లు ఆదా అవుతోంది. గతంలో హైమాస్ట్, మె ర్క్యూరి లైట్లు వినియోగించినప్పుడు ప్ర తి నెలా రూ. 85 నుంచి 90 లక్షల వరకు విద్యుత్ బిల్లు వచ్చేంది. ప్రస్తుతం రూ. 35 లక్షల బిల్లు వస్తోందని అధికారులు చెబుతున్నారు. వీధి దీపాల నిర్వహణను ఎనర్జీ ఎఫిషీయంట్ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) సంస్థకు అప్పగించారు. ఏడేళ్ల వరకు వీధి దీపాల నిర్వహణ, మరమ్మతులు సదరు సంస్థ నిర్వహిస్తుంది.
వంద శాతం దిశగా..
407 చదరపు కిలోమీటర్తు విస్తరించి ఉన్న మహానగరంలో వంద శాతం వీధి దీపాల ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 67వేలకు పై గా ఎల్ఈడీ లైట్లు ఉన్నాయి. ఇటీవల 10 రోజుల పాటు జరిగిన పట్టణ ప్రగతిలో అ ధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. వీధి దీపాలు అవసరం ఉన్న ప్రాంతాలను గుర్తించారు. ఇప్పటికే కొత్త విద్యుత్ స్తం భాలు ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాలకు సంబంధించిన స్కెచ్ను ట్రాన్స్కో అధికారులకు పంపించామని తెలిపారు. మరో మూడు నెలల్లో స్తంభాలు ఏర్పాటు చేసి లైట్లను బిగిస్తామని అధికారులు చెప్పారు.
డివిజన్ల వారీగా సర్వే..
గ్రేటర్లోని 66 డివిజన్లలోని స్ట్రీట్ లైట్ల వివరాలు సేకరిస్తున్నారు. బల్దియా ఎలక్ట్రికల్ విభాగం సర్వే పనిలో నిమగ్నమైంది. గతంలో ఉన్న డివిజన్లు పునర్విభజన నేపథ్యంలో మారిపోయాయి. ఒక్కో డివిజన్లోని ప్రాంతాలురెండు, మూడు డివిజన్ల పరిధిలోకి పోయాయి. దీంతో కొత్తగా ఏర్పాటైన 66 డివిజన్ల వారీగా స్ట్రీట్ లైట్లపై సర్వే చేస్తున్నారు. నగరంలో వంద శాతం వీధి దీపాల లక్ష్యం పూర్తికి పక్కా లెక్కలు తీస్తున్నారు. ముఖ్యంగా నగరంలో కొత్తగా ఏర్పాటైన కాలనీలు, విలీన గ్రామాలను కలిపే అప్రోచ్ రోడ్లు, శ్మశాన వాటికల్లో లైట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నట్లు అధికారుల సర్వేలో తేలింది. అలాగే కొత్త స్తంభాల ఏర్పాటుకు ట్రాన్స్కో అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.