బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్ చాలా స్లో అండ్ స్టడీగా గేమ్ ఆడుతూ ట్రోఫీని గెలుచుకున్న విషయం తెలిసిందే. ట్రోఫీ గెలుచుకున్న తర్వాత పెద్దగా వార్తల్లోకి ఎక్కని అభిజీత్ ఇప్పుడు మంచి పనితో అందరి మనసులు గెలుచుకున్నాడు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించాయి. దీంతో చాలా మంది నిత్యావసర సరకులు లేక ఇబ్బంది పడుతున్నారు. వీరి బాధలను గుర్తిస్తున్న సెలబ్స్ తమ వంతు సాయాలు చేస్తున్నారు.
సిద్ధిపేటకు చెందిన మూడు కుటుంబాలు నిత్యావసర సరుకులు కోసం ఇబ్బంది పడుతున్నట్టు అభిజీత్కు ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో వెంటనే స్పందించిన అభిజీత్ తనకు తెలిసిన వ్యక్తులను దాని గురించి తెలుసుకోమని చెప్పాడు. వారు తెల్లారే సరికి ఈ ఫొటోలు, వీడియోలు అభిజీత్కు పంపారు. వారు చేసిన సేవలకు ఫిదా అయిన అభిజీత్ తన ఇన్స్టాలో వారి ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశాడు. మంచి పని కోసం సహకరించిన సిద్దిపేట యువకులకు ధన్యవాదాలు’ అంటూ అభిజిత్ తన ఇన్స్టాలో రాసుకొచ్చాడు.