రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో దారుణం జరిగింది. అభం శుభం తెలియని మూడేళ్ల చిన్నారిపై ఓ మానవ మృగం విరుచుకుపడింది. భూపతి నగర్కు చెందిన చిన్నారిపై అక్కడే నివాసముంటున్న బూర్ల చంద్రశేఖర్ అత్యాచారం చేశాడు. బాధిత చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి చంద్రశేఖర్ను అదుపులోకి తీసుకున్నారు. చంద్రశేఖర్ను కఠినంగా శిక్షించాలని చిన్నారి తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..