వైరస్ నియంత్రణకు సర్కారు చర్యలు
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్
జగిత్యాల అర్బన్, మార్చి 29 : కరోనా బాధితులు అధైర్యపడవద్దని, ఆ కాలనీవాసులు భయాందోళనలకు గురికావద్దని, కరోనా కట్టడికి ప్రభుత్వం అ న్ని చర్యలు తీసుకుంటుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్ ధైర్యం చెప్పారు. జిల్లా కేంద్రంలోని 8వ వార్డు పరిధిలో పలువురు వ్యక్తులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఎమ్మెల్యే జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ బోగ శ్రావణితో కలిసి వార్డులో పర్యటించారు. ఇంటింటికీ తిరుగు తూ ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించడమే కాకుండా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను పరామర్శిస్తూ ధైర్యంగా ఉండాలని చెప్పారు. జిల్లా ప్రధా న దవాఖానలో కరోనా వార్డును కొనసాగిస్తున్నామని, కోవిడ్ పేషెంట్లు ఆ వార్డును వినియోగించుకోవాలని సూచించారు. 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ఏప్రిల్ 1 నుంచి కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవచ్చని తెలిపారు. కాలనీలో ఇంటింటా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలన్నారు. అనంతరం వైద్య సిబ్బంది ఇంటింటా థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ మున్సిపల్ వైస్ చైర్మ న్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్ వానరాసి మల్లవ్వ, నాయకులు తిరుమలయ్య, వెంకటయ్య ఉన్నారు.
ఇవి కూడా చదవండి
సైనికుడిగా అల్లు అర్జున్ తనయుడు అయాన్
జాతీయ బేస్బాల్ టోర్నీకి సుప్రియ