హన్మకొండ సిటీ, జూన్ 30 : భరోసా కేంద్రం బాధిత మహిళలకు బాసటగా నిలవాలని వరంగల్ పొలీస్ కమిషనర్ తరుణ్జొషీ సూచించారు. భరోసా కేంద్రం నెలకొల్పి ఏడాది పూ ర్తయిన సందర్భంగా సుబేదారి పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న భరోసా కేంద్రాన్ని సీపీ బుధవారం సందర్శించారు. ఈ సం దర్భంగా కేక్కట్ చేసి సిబ్బందిని అభినందించారు. అనంతరం భరోసా సెంటర్ పనితీరుపై ఆరా తీశారు. బాధిత మ హిళలకు ప్రభుత్వం అందించే నష్టపరిహారంతో పాటు భరో సా కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలు, ప్రస్తుత కేసుల స్థితిపై భరోసా కేంద్రం కౌన్సిలర్ స్వాతిని అడిగితెలుసుకున్నారు. నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుని, బాధిత మహిళలకు ఆత్మైస్థెర్యాన్ని పెంచి మెరుగైన జీవితాన్ని అందించేందుకు భరోసా కేంద్రం టీం నిరంతరం పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జొన్ డీసీపీ పుష్ప, సీఐ సుజాత, భరోసా సిబ్బంది నవ్య, రజిత, మానస, పవిత్ర, మహిళా హోంగార్డు సంధ్య పాల్గొన్నారు.
ట్రాఫిక్ సిబ్బందికి రెయిన్ కోట్లు పంపిణీ
హన్మకొండ సిటీ: ట్రాఫిక్ సిబ్బందికి వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జొషీ చేతుల మీదుగా మాజీ శాప్ డైరెక్టర్ రాజనాల శ్రీహరి బుధవారం రెయిన్ కోట్లు అందజేశారు. సుమా రు 250 మందికి శ్రీహరి రెయిన్ కోట్లు అందించిన సందర్భంగా సీపీ మాట్లాడుతూ వాహనదారులు గమ్యానికి చేరుకోవడంలో ట్రాఫిక్ పోలీసుల పాత్ర కీలకమని, వానకాలంలో వర్షాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించే క్రమంలో కొంత మంది సిబ్బంది ఆనారోగ్యం చెందుతున్నారు. సిబ్బంది ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని శ్రీహరి ముందుకొచ్చి రెయిన్ కోట్లు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ పుష్ప, ఏసీపీ బాలస్వా మి, ఇన్స్పెక్టర్లు విజయ్కుమార్, రామకృష్ణ పాల్గొన్నారు.