కరీమాబాద్, డిసెంబర్ 23 : మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. గురువారం 32వ డివిజన్ ఎస్ఆర్ఆర్తోటలో కార్పొరేటర్ పల్లం పద్మ ఆధ్వర్యంలో మహిళల కమ్యూనిటీ హాల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు కమ్యూనిటీ హాల్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదన్నారు. మహిళా సంఘాలకు అండగా ఉంటానన్నారు. ప్రతి డివిజన్లో వీరి కోసం ప్రత్యేక భవనం నిర్మాణం జరిగేలా చొరవ చూపుతానన్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తానన్నారు. కార్యక్రమంలో కుడా సలహామండలి సభ్యుడు మోడెం ప్రవీణ్, మాజీ కార్పొరేటర్లు కత్తెరశాల వేణుగోపాల్, నాగపురి కల్పన, పల్లం రవి, నాయకులు ఎంఏ జబ్బార్, వెలిదె శివమూర్తి, బొల్లం రాజు, బత్తుల కుమార్, పరదేశి రాజేశ్, నాగపురి సంజయ్బాబు, క్యాతం ఎల్లయ్య, ఆడెపు భిక్షపతి, కొండ సూరి, మాటేటి శ్యాం, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు అండగా ఉంటా
నియోజకవర్గ ప్రజలకు అండగా ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే నన్నపునేని అన్నారు. కార్పొరేటర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో 40వ డివిజన్లో పర్యటించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మంత్రి కేటీఆర్ అండదండలతో ఇప్పటికే పలు అభివృద్ధి పనులు చేశామన్నారు. ఉర్సు చెరువు సమీపంలో పార్కు ఏర్పాటుకు ఖిలావరంగల్ తహసీల్దార్ మంజుల, ఆర్ మనోహర్తో కలిసి స్థలాన్ని పరిశీలించారు.
పాఠశాలలో వసతుల కల్పనకు కృషి
కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల సిబ్బందితో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానన్నారు. వాటర్ప్లాంట్ ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తానన్నారు. హెచ్ఎం సరళ పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, దసరా రోడ్ అభివృద్ధి పనులతో తామంతా నష్టపోతున్నామని పలువురు చెప్పగా, పేదలకు నష్టం కలుగకుండా చూస్తానన్నారు. కరీమాబాద్ నానమియాతోటలో చేపట్టనున్న పోచమ్మగుడి ఆలయ నిర్మాణానికి తనవంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు.