కొత్తకోట: ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ లోకానికి పదోన్నతలు, బదిలీల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్సీ కాటెపల్లి జనార్దన్రెడ్డి అన్నారు. బుధవారం కొత్తకోట పట్టణంలోని పీఆర్టీయూ టీఎస్ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలోనే జీపీఎఫ్, విద్యా వలంటీర్ల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక విద్యా వ్యవస్థను బలోపేతం చేసి పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించిందని, విద్యార్థులకు సన్నబియ్యం అన్నం పెడు తుందని, విద్యార్థినులకు మరుగుదొడ్లు, పాఠశాలల పరిశుభ్రత పాటించిందన్నారు. పాఠశాల లో నెలకొని ఉన్న సమస్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. త్రాగునీరు ఇబ్బందులు కలగకుండా చూసిందన్నారు.
అనంతరం పట్టణంలోని రిటైర్డు ఉద్యోగుల భవనానికి తన నిధుల నుంచి రూ.5 లక్షలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు వరప్రసాద్, ప్రదాన కార్యదర్శి బౌద్దారెడ్డి, ఉపాధ్యాయులు చంద్రశేఖర్, రఘు రామ్రెడ్డి, సత్యనారాయణ, శ్రీనివాస్రెడ్డి, వరప్రసాద్, ప్రతాప్ రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, రవీందర్గౌడ్, శివశంకర్యాద్యావ్, రవీం దర్రెడ్డి, శ్రీశైలం, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.