భువనగిరి అర్బన్, జూలై 8: నూతన పురపాలక చట్టాన్ని అనుసరించి పట్ట ణ, స్థానిక సంస్థల పరిధిలోని లే అవుట్లకు అనుమతులు జారీ చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్కుమార్ జిల్లాల కలెక్టర్లు, స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్లను ఆదేశించారు. గురువారం ఆయన హైదరాబాద్ నుంచి యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట, జనగాం, ఖ మ్మం జిల్లాల కలెక్టర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా లేఅవుట్లు, భవన నిర్మాణ అనుమతులు, పట్టణప్రగతి, హరితహారం తదితర అంశాలపై పలు సూచనలు చేశారు.
2019 జూలై నుంచి నూతన మున్సిపల్ చట్టం నిబంధనల ప్రకారం టీఎస్-బీపాస్ ద్వారా ఆన్లైన్లో వచ్చి న లేఅవుట్లు, పట్టణ ప్రణాళిక విభాగం టెక్నికల్ పరిశీలన తర్వాత కలెక్టర్ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ కమిటీ అనుమతులు జారీ చేయాలన్నారు. లేఅవుట్లలోని ఖాళీ స్థలాలను మున్సిపాలిటీల, జీపీల పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఆ స్థలంలో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. 10 ఎకరాల వరకు టెక్నికల్ స్క్రీనింగ్ తర్వాత జిల్లాస్థాయి కమిటీ, 10 ఎకరాలు దాటితే డీటీసీపీ ద్వారా లేఅవుట్ అనుమతులు నిర్ణీత సమయంలో జారీ చేయాలన్నారు. 10శాతం లేఅవుట్ స్థలంలో ఓపెన్ స్థ లం సంబంధిత స్థానిక సంస్థల పేరున రిజిస్ట్రేషన్ కావాలన్నారు. 2019 జూలై తర్వాతాముందు లేఅవుట్ల అనుమతులు ఎన్ని ఇచ్చారో రికార్డు చేయాలని అధికారులకు సూచించారు. భవన నిర్మాణ అనుమతులు, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశించారు. పట్టణ ప్రణాళిక అధికారులు, సిబ్బంది, లేఅవుట్ల అనుమతు లు, భవన నిర్మాణ అనుమతు ల్లో నిర్లక్ష్యం చేసినా, అక్రమాల కు పాల్పడినా వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
అనుమతులు లేని లేఅవుట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా సర్వేనంబర్ల తో సబ్రిజిస్ట్రార్లకు లేఖలు రా యాలని ఆయన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లకు సూచించారు. పట్టణాల్లో రహదారుల సెంట్రల్ మీడియన్ రోడ్డు, మార్జిన్లలో అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, జూనియర్ కళాశాలలు, దవాఖానలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. పట్టణంలోని ఖాళీ స్థలాలు మొక్కలతో కనిపించాలని, చెత్తను ప్రతిరోజూ సేకరించి వాహనాల ద్వా రా డంపింగ్ యార్డుకు తరలించాలన్నారు. ప్రతి మున్సిపాలిటీలో డీఆర్సీఎఫ్ ఎస్టీపీ (మురుగు నీటి శుద్ధ్దీకరణ ప్లాంట్)ల ఏర్పాటుకు స్థలాన్ని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. వెజ్, నాన్వెజ్ మార్కెట్లను పట్టణంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పా టు చేయాలని, వైకుంఠధామాల్లో ప్రహరీ, పరిశుభ్రత, స్నానపుగదులతోపాటు వసతులు కల్పించాలన్నారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్తివారీ, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.