ఉమ్మడి జిల్లాలో అద్దెకు సాగు పనిముట్లు
ఒక్కో సెంటర్కు రూ.22 లక్షలకుపైగా ఖర్చు
మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహణ
ఆర్థికంగా బలపడుతున్న సమాఖ్యలు
రైతుకు దన్నుగా నిలిచిన ప్రభుత్వం
మహబూబ్నగర్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ ప్ర తినిధి)/గద్వాల : ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ పనిముట్లు అద్దెకు లభ్యమవుతున్నాయి. పంటల సాగుకు పేద రైతులు ఇబ్బందులు పడొద్దనే ఉద్దేశంతో కస్టమ్ హైరింగ్ సెంటర్లను గ్రామీణ జీవనోపాధి మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఒక్కో సెంటర్ ఏర్పాటుకు రూ.22 లక్షలకుపైగా నిధులను ఖర్చు చేశారు. ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నా.. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో ఏడు సెంటర్లను ఏర్పాటు చేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో వీటి నిర్వహణ కొనసాగుతున్నది. ఇక్కడున్న యంత్రాలు, పరికరాలను వ్యవసాయ పనులకు అద్దెకు ఇస్తుండడంతో సమాఖ్యలు ఆర్థికంగా బలోపేతమవుతున్నాయి. రైతుకు వెన్నుదన్నుగా ప్రభుత్వం నిలవడంతోపాటు అందుబాటు ధరల్లో పనిముట్లు లభిస్తుండటంతో కర్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు వ్యవసాయ యంత్ర పరికరాల కోసం ఇబ్బందులు పడకుం డా ఉండేందుకు కస్టమ్ హైరింగ్ కేంద్రాల ద్వారా పనిముట్లు అద్దెకు ఇస్తున్నారు. గ్రామీణ జీవనోపాధి మిషన్ నిధులతో ఈ సెంటర్లను సెర్ప్ ఏర్పాటు చేస్తున్నది. ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నా.. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో ఏడు కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక్కో సెంటర్ ఏర్పాటుకు రూ.22 లక్షలకు పైగా నిధులు ఖర్చు చేస్తున్నారు. తక్కువ ధరల్లోనే స్థానికంగానే అన్ని రకాల వ్యవసాయ పనిముట్లు అద్దెకు లభిస్తుండడంతో అన్నదాతలు ఆనందంగా ఉన్నారు. సొంతంగా పరికరాలు కొనుగోలు చేయలేని రైతులకు ఈ కేంద్రాలు ఎంతో ప్రయోజనకరంగా మారాయి.
రైతులకు ఉపయోగకరంగా..
వ్యవసాయ రంగాన్ని కొత్తపుంతలు తొక్కించేందుకు సర్కార్ వేగవంతంగా చర్యలు చేపట్టింది. చిన్న, సన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పరికరాలను అద్దెకు ఇచ్చేందుకు కస్టమ్ హైరింగ్ కేంద్రాల ను ప్రారంభించారు. పైలట్ ప్రాజెక్టు కింద ఉమ్మడి జిల్లా లో ఏడు సెంటర్లను ప్రారంభించారు. ఒక్కో కేంద్రంలో రూ.22 లక్షలతో వ్యవసాయ యంత్రాలు, పరికరాలను కొనుగోలు చేశారు. గ్రామాల్లో ఉన్న మహిళా పొదుపు సంఘాల ద్వారా చిన్న, సన్నకారు రైతులకు వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అద్దెకు ఇస్తున్నారు. బయటి మార్కెట్ కంటే తక్కువ కిరాయికే రైతులకు వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అందజేస్తున్నారు. పొదుపు సంఘాలకు రుణ పద్ధతిన వ్యవసాయ ఉపకరణాలను సమకూర్చి వాటిని రైతులకు లాభాపేక్షరహితంగా అద్దె కు ఇచ్చేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తున్నది. వాస్తవానికి వ్యవసాయంలో ఆధునిక యంత్రాల వినియోగం బాగా పెరిగిన విషయం తెలిసిందే. ఉపాధిహామీ పథకం ప్రవేశపెట్టిన తర్వాత కూలీలకు కొరత ఏర్పడి రైతులు అవస్థలు పడుతున్నారు. చిన్న, సన్నకారు రైతులు లక్ష లు వెచ్చించి యంత్రాలను కొనుగోలు చేసే శక్తిలేక తమ పొలం పనుల సమయంలో పెద్ద రైతులను ఆశ్రయిస్తున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సెంటర్లను ఏర్పాటు చేసింది.
అద్దెకు ఆధునిక పరికరాలు..
మహిళా సంఘాల ద్వారా స్థానిక రైతులకు తక్కువ అద్దెకు వ్యవసాయ ఉపకరణాలు అందించేందుకు ప్ర భుత్వం చేసిన ప్రయత్నం క్రమంగా విజయవంతమవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. చిన్న, సన్నకారు రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. మొదట ప్రతి జిల్లాలోని ఒక మండలా న్ని ఎంపిక చేసి.. అక్కడ వ్యవసాయ యంత్రాలు, ప రికరాలను అందజేస్తున్నారు. దశలవారీగా అన్ని మం డలాలు, గ్రామాల్లో అద్దెకు వ్యవసాయ పనిముట్లు ఇచ్చే కేంద్రాలను ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తున్నది. యంత్రాలు అద్దెకు ఇవ్వడం వల్ల వచ్చే సొ మ్ముతో మహిళా సంఘాలు ఆర్థికాభివృద్ధి సాధించనున్నాయి. స్థానికంగా ఉండే రైతు సంఘా లు, వ్యవసాయశాఖ అధికారుల సలహాతో అద్దె నిర్ణయిస్తారు. చిన్న, సన్నకారు రైతు లు యాంత్రిక, శాస్త్రీయ పద్ధతుల్లో అధిక ఉత్పత్తులు సాధించడానికి, సాగు విస్తీర్ణం పెంచుకోవడానికి ఇది దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు.
అద్దెకిచ్చే యంత్రాలివే..
ట్రాక్టర్, ట్రాలీ, మల్టీ థ్రెషర్, రోటోవేటర్లు, కల్టివేటర్లు, 9 ఫ్లో కల్టివేటర్, 5 ఫ్లో కల్టివేటర్, పవర్ వీడర్, హ్యాండ్ స్ప్రే, పవర్ స్ప్రే వంటి యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. మల్టీ థ్రెషర్, ట్రాక్టర్ కలిపి బయట మార్కెట్లో గంటకు రూ.1500 వరకు అద్దె వసూలు చేస్తే.. మహిళా సంఘాలు మాత్రం రూ.1200 వరకు వసూలు చేస్తున్నాయి. రోటోవేటర్లు గంటకు బయట రూ.1200 అయితే.. కస్టం హైరింగ్ సెంటర్లో రూ.1000కు ఇస్తున్నారు. పవర్ స్ప్రే బయటకు గంటకు రూ.200 ఉంటే.. ఇక్కడ ఒక్క రోజుకు రూ.500 మాత్రమే అద్దె వసూలు చేస్తున్నారు. పవర్ వీడర్కు బయట గంటకు రూ.1200 అయితే.. ఇక్కడ రూ.1000 మాత్రమే. డిసెంబర్లో ప్రారంభించిన తిమ్మాజిపేట కస్టం హైరింగ్ సెంటర్లో ఇప్పటి వరకు 16 మంది రైతులు యంత్రాలు అద్దెకు తీసుకున్నారు. ఆ కేంద్రానికి రూ.19 వేలు ఆదాయం సమకూరింది. పంటలు ముగిసిన తర్వాత ప్రారంభించినందున ఎక్కువ మంది రైతులు వినియోగించుకోలేకపోయినట్లు అధికారులు తెలిపారు. మళ్లీ వ్యవసాయ పనులు ఊపందుకుంటే యంత్రాలను అద్దెకు తీసుకునే వారి సంఖ్య పెరుగుతుందని అంటున్నారు. నవాబ్పేట కేంద్రానికి ఇప్పటివరకు రూ.1.20 లక్షల ఆదాయం సమకూరింది. వల్సమోని మెషీన్ (8 రకాల పంటల నూర్పిడి యంత్రం)కు మంచి డిమాండ్ వచ్చిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరికరాలతోపాటు ఆధునిక యంత్రాలు అందుబాటులో ఉంచేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. స్థానిక రైతుల అవసరాల మేర కొత్త యంత్రాలను కూడా కొనుగోలు చేసి అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.
ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చు..
యంత్రాల కొనుగోలుకుగానూ మల్దకల్ మండల సమాఖ్యకు ప్ర భుత్వం నిధులు మంజూ రు చేసింది. యంత్రాల ను అద్దెకు ఇవ్వడంతో సంఘం బలోపేతమ య్యే ఆస్కారం ఉన్నది. రైతులకు బయట మార్కెట్ కంటే తక్కువ ధరకు యంత్రాలు అందిస్తున్నాం. ఆ అవకాశాన్ని రైతులు సద్వినియోగించుకుంటున్నారు. దీంతో మా సమాఖ్య అభివృద్ధి చెందింది. ప్రభుత్వ చేయూతతో ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఏర్పడింది.
మహిళా సంఘాలకు చేయూత..
టీఆర్ఎస్ సర్కార్ ఏ ర్పడిన తరువాతే మహి ళా సంఘాలు ఆర్థికంగా బలోపేతమయ్యాయి. అందరూ ఒకేలావ్యాపారం చేయకూడదనే ఉద్దేశంతో.. రైతులకు మంచి చేయాలనే సంకల్పంతో యంత్రాలు కొనుగోలు చేశాం. ప్రత్యేకంగా డ్రైవర్ ఏర్పాటు చేసుకున్నాం. సీజన్లో యంత్రాలు అద్దెకు తీసుకుంటున్నారు. తమకు సాయం అందించిన ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాం.