వనపర్తి, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం మార్చిలోగా లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశించారు. మంగళవారం వనపర్తిలోని క్యాంపు కా ర్యాలయంలో కలెక్టర్ యాస్మిన్ బాషాతో కలిసి దళితబంధు పథకంతోపాటు వివిధ అభివృద్ధి పనులపై మం త్రి సమీక్ష జరిపారు. నియోజకవర్గం నుంచి 100 మం ది లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో ఒక్కో వార్డుకు ఒక్కరి చొప్పున 6 లేదా 7 కుటుంబాలను ఎంపిక చేయాలని సూచించారు. శ్రీ రంగపూర్, రేవల్లి మండలాల్లో ఐదు కుటుంబాల చొప్పున ఎంపిక చేయాలని, మిగిలిన మండలాల్లో జా ప్యం లేకుండా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ అభివృద్ధి పథకాల పనులను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ యాస్మిన్ బాషా మాట్లాడుతూ రెండు పడక గదుల ఇండ్లు, ప్రకృతి వనాలు, సీసీ రోడ్లు, బీటీరోడ్లు, రెవెన్యూ, మున్సిపాలిటీ, అటవీశాఖ స్థలాల సరిహద్దులు, వ్యాక్సినేషన్, రైతుల సమస్యలు, ఎల్పీజీ గ్యాస్ పైప్లైను పనులు,కేజీబీవీ రేవల్లి స్థల పరిశీలన, ఎలక్ట్రిసిటీ, బాలరక్షా భవన్ స్థల పరిశీలన, పీఎస్ఎస్ గోదాముల స్థల పరిశీలన, ఇరిగేషన్ తదితర ఆంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ఎస్పీ అపూర్వరావు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, ఇరిగేషన్ సీఈ రఘునాథ్రావు, డీఎఫ్వో రామకృష్ణ, ఎస్సీ కార్పొరేషన్ అధికారి నుషిత, పంచాయతీరాజ్ ఈఈ మల్లయ్య, ఆర్అండ్బీ ఈఈ దాస్యానాయక్, డీఈ దానయ్య, సివిల్సప్లయి అధికారి అనిల్కుమార్, సీఐ ప్రవీణ్కుమార్, ఫారెస్ట్ అధికారి వాణికుమారి పాల్గొన్నారు.
లబ్ధిదారుల ఎంపికకు సహకరించాలి
నియోజకవర్గంలో పార్టీలకతీతంగా అర్హులైన లబ్ధిదారుల ఎంపికకు కార్యకర్తలు సహకరించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కోరారు. సోమవారం రాత్రి నియోజకవర్గ దళిత నాయకులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. మొదటి విడుతలో మార్చి నాటికి నియోజకవర్గంలోని చిన్న గ్రామాలను ఎంపిక చేసుకొని దశలవారీగా దళితులందరికీ దళితబంధు అందేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని ఒక యూనిట్కు రూ.10లక్షలు కేటాయిస్తుందన్నారు. దళితులు ఎక్కడైన తమ ఆలోచనలతో సమిష్టిగానైన, వ్యక్తిగతంగానైన దళితబంధుకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దళితుల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పెబ్బేర్ మున్సిపల్ చైర్పర్సన్ కరుణశ్రీ, జెడ్పీటీసీ వెంకటేశ్, దళిత నాయకులు కోళ్ల వెంకటేశ్, ఎత్తం రవి, శరబంద, పరంజ్యోతి, సప్తగిరి, విజయ్మోహన్, ఎంపీటీసీలు, సర్పంచులు ఉన్నారు.
‘మిషన్’తో పెరిగిన భూగర్భ జలాలు
వనపర్తి, జనవరి 24: మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువులు, కుంటల పునరుద్ధరణ పనులు చేపట్టడంతో భూగర్భజలాల మట్టం పెరిగిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని తాళ్ల చెరువు, లక్ష్మికుంట చెరువు పనులను కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషాతో కలిసి మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణ పనుల్లో నాణ్యత పెంచాలన్నారు. స్వరాష్ట్రంలో గ్రామాల్లో నీటి కొరత తీరిందని, చెరువులు, కుంటలు నిండుగా కళకళలాడుతున్నాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు రమేశ్గౌడ్, కౌన్సిలర్ విభూతి నారాయణ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.