వికారాబాద్ : మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి జన్మదినం సందర్భంగా ఆయన నివాసంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, మండల అధ్యక్షుడు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు గురువారం కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానం చేశారు. ఎమ్మెల్యే వెంట వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కమాల్రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్కుమార్, ఆయా మండలాల అధ్యక్షులు, పార్టీ నాయకులు ఉన్నారు.