వికారాబాద్, మే 19 : జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు చదువుకుంటున్న అభ్యర్థుల సౌక ర్యాలు కల్పించాలన్న చైర్మన్ మురళీకృష్ణ వినతి మేరకు పలువురు దాతలు ఫర్నిచర్ను అందజేసినట్లు జిల్లా గ్రంథాలయ కార్యదర్శి సురేష్బాబు తెలిపారు.
రాంరెడ్డి (దోమ భీంరెడ్డి సేవా సమితి) 15 కుర్చీలు, వికారాబాద్కు చెందిన వడ్ల నందు 25 , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ 50 , జైహింద్ రంగారెడ్డి జిల్లా లైబ్రేరియన్ ఆయన తండ్రి జ్ఞాపకార్థం 14 కుర్చీలు, ఉమేష్ 8 సీలింగ్ ఫ్యాన్లు అందజేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులు 10 కుర్చీలు, వంద రైటింగ్ప్యాడ్లను పాఠకుల సౌకర్యార్థం జిల్లా గ్రంథాలయ సంస్థకు డొనేట్ చేశారు.