TS Inter Results : తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు (TS Inter Results-2024) ఇవాళ ( బుధవారం) విడుదల కానున్నాయి. ఈ ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఈ ఫలితాలను వెల్లడిస్తారు.
తెలంగాణలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 9,80,978 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఫలితాల కోసం విద్యార్థులు www.ntnews.com, www.telanganatoday.com లను సంప్రదించవచ్చు. అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్సైట్ https://tsbie.cgg.gov.in/ లో కూడా ఫలితాలను చూసుకోవచ్చని అధికారులు సూచించారు. వెబ్సైట్లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా మార్కుల మెమో సాఫ్ట్ కాపీని ప్రింట్ తీసుకోవచ్చని తెలిపారు.