షాద్నగర్, ఏప్రిల్ 23 : కాంగ్రెస్ అంటేనే కరువు.. అధికారంలోకి రావడంతోనే కరువు తాండవిస్తున్నది.. అటువంటి కాంగ్రెస్కు ఓటు వేయవద్దని మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్, ఎంపీ ఎన్నికల షాద్నగర్ ఇన్చార్జి దూదిమెట్ల బాల్రాజ్యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం షాద్నగర్ పట్టణంలోని రెడ్ రోస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఎంపీ ఎన్నికల ప్రచార సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో అభ్యర్థులు దొరుకని పరిస్థితి నెలకొన్నదని ఎద్ద్దేవా చేశారు. సీఎం రేవంత్రెడ్డి ఆగస్టు 15 వరకు పదవిలో ఉంటారా ? లేదా ? అనే విషయం తెలియని పరిస్థితి ఉన్నదన్నారు. ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చని సీఎం రేవంత్రెడ్డి ఏక కాలంలో పంట రుణమాఫీ చేస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. డబ్బులు పెట్టి పీసీసీ పదవి తెచ్చుకున్నారని అప్పట్లో ఆరోపించిన కోమటి రెడ్డి బ్రదర్స్ను మెచ్చుకోవడం చూస్తుంటే సీఎం పరిస్థితి ఎట్ల ఉందో రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందన్నారు. ఏనాడు కూడా పాలమూరు ప్రజల పక్షాన పనిచేయని వంశీచంద్రెడ్డికి ఎలా ఓటు వేస్తారని ప్రశ్నించారు.
తెలంగాణ జలాలను అక్రమంగా సీమాంధ్రకు దోచుకెళ్తుంటే హారతులు పట్టిన బీజేపీ అభ్యర్థి డీకే ఆరుణకు పాలమూరు ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఓటుకు నోటు కేసులో జైలుకు పోయిన వ్యక్తి సీఎం కావడం మనందరి దురదృష్టమన్నారు. కాంగ్రెస్ మోసాలను ప్రశ్నించాలని, తులం బంగారం ఎక్కడ ? వడ్లకు రూ.500 బోనస్ ఎందుకు ఇవ్వలేదు ? మహిళలకు రూ.2500 ఎమయ్యాయి ? వృద్ధులకు రూ. 4 వేల పింఛన్లు ఎక్కడకు పోయాయి ? రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదు ? వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు. ఎన్నో మెడికల్ కళాశాలలు, గురుకుల పాఠశాలలు, సాగు నీటి ప్రాజెక్టులు, పరిశ్రమలను తీసుకొచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని గుర్తుచేశారు. శ్రీరాముడి పేరుతో బీజేపీ రాజకీయాలు చేస్తున్నది కానీ పేదల కోసం పని చేయలేదని మండిపడ్డారు. ఏడాదికి లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో యువత ఆలోచించాలని కోరారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్కుమార్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఈటె గణేశ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్ నటరాజన్, కేశంపేట ఎంపీపీ వై. రవీందర్యాదవ్, మాజీ ఎంపీపీ బెంది శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వంకాయల నారాయణరెడ్డి, నాయకులు బుచ్చిగూడ వెంకట్రెడ్డి, రాంభాల్నాయక్, రాజావరప్రసాద్, మన్నె నారాయణయాదవ్, సర్వర్పాష, ఈగ వెంకట్రాంరెడ్డి, నక్కల వెంకటేశ్గౌడ్, రాజ్యలక్ష్మి, రాయికల్ వెంకట్రెడ్డి, రబ్జానీ, ఎండీ ఎజాజ్, జీటీ శ్రీనివాస్, బీష్వ రామకృష్ణ, లక్ష్మణ్నాయక్, రాఘవేందర్రెడ్డి, చంద్రశేఖర్గౌడ్, షారుఖ్, కిషోర్, మండల, పట్టణ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.