హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): బోగస్ పత్రాలు చూపించి రూ.1,745.45 కోట్లకు పైగా బ్యాంకులను మోసం చేసిన కేసులో హైదరాబాద్కు చెందిన వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్ కేసులో రూ.55.73 కోట్ల స్తిర, చరాస్తులను ఎన్ఫోన్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది. 2018లో బెంగళూరులో నమోదైన ఈ కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఉప్పలపాటి హిమబిందును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గతంలోనే అరెస్టు చేశారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ల కన్సార్షియం నుంచి వీఎంసీ డైరెక్టర్లు భారీ మొత్తంలో రుణాలు తీసుకున్నారు. ఇందుకోసం నకిలీ పత్రాలు సృష్టించారని బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేయడంతో ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించి, సోదాలు నిర్వహించారు. రూ.692 కోట్ల మేరకు హిమబిందు డమ్మీ లెటర్ ఆఫ్ క్రెడిట్లు సృష్టించినట్టు ఈడీ గుర్తించింది. తాజాగా ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని సతీశ్కుమార్ నివాసం, రంగారెడ్డిలోని అనాజ్పూర్లోని వ్యవసాయ భూమి, అసోంలోని క్యాచర్ జిల్లాలో 580.77 ఎకరాల్లో 11.73 కోట్ల విలువైన ప్రాపర్టీస్, టీ ఎస్టేట్ వంటివి ఉన్నాయి.