వికారాబాద్, ఏప్రిల్ 9 : ఈనెల 30వ తేదీ వరకు ప్రాథమిక గొర్రెల కాపరుల సంఘం ఎన్నికల పక్రియను పూర్తి చేయాలని జిల్లా పశువైద్య సంచాలకులు అనిల్కుమార్ సంబంధిత అధికారులను అదేశించారు. శుక్రవారం జిల్లా పశు వైద్య సంవర్ధకశాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కల్గిన కొత్త, పాత పీఎస్బీసీఎస్ అన్నింటికీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. పశు వైద్యులను స్పెషల్ ఆఫీసర్లుగా అన్ని పీఎస్బీసీఎస్కు నియమించి ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. సభ్యుల ఫొటోలు, ఆధార్ నంబర్లతో లిస్టు తయారు చేస్తామని చెప్పారు. సలహాలు, సందేహాలకు జిల్లా కో ఆపరేటివ్ అధికారి, రాష్ట్ర కోఅపరేటివ్ అధికారిని సంప్రదించాలన్నారు. ఎన్నికల పక్రియ ఏప్రిల్ 30వ తేదీ వరకు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. పర్సన్ ఇన్చార్జిలు ఓటరు లిస్టును తయారు చేసి సంఘం కార్యాలయంలో ప్రదర్శించాలన్నారు. అభ్యంతరాలకు వారం గడువు ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా సహాయ సంచాలకుడు సదానందం, పశువైద్యాధికారులు, జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు రాంచందర్, మండల కురుమ సంఘం అధ్యక్షుడు సంఘమేశ్ పాల్గొన్నారు.
ఎన్నికలు నిర్వహించాలి
గ్రామాల్లోని గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా పశువైద్యాధికారి అనిల్కుమార్ సూచించారు. శుక్రవారం నియోజకవర్గంలోని పరిగి, దోమ, కులకచర్ల, పూడూరు మండలాలకు చెందిన గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల చైర్మన్లతో నిర్వహించిన సమావేశంలో జిల్లా పశువైద్యాధికారి మాట్లాడారు. నియోజకవర్గంలో 78 గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలున్నాయన్నారు. ముందుగా సభ్యుల వివరాలు సేకరించి సంబంధిత పంచాయతీ కార్యాలయాల వద్ద ఉంచుతామని పేర్కొన్నారు.
ఇవీ కూడా చదవండి…
టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల వివరాలు సిద్ధం