హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): మేనేజ్మెంట్ రంగంలో పరిశోధనలు నిర్వహించేందుకు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆస్కీ), జేఎన్టీయూల మధ్య ఎంవోయూ కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా రెండు సంస్థలు పీహెచ్డీ కోర్సును నిర్వహిస్తాయి. శుక్రవారం ఆస్కీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆస్కీ చైర్మన్ కే పద్మనాభయ్య, జేఎన్టీయూ ఇంచార్జి వీసీ జయేశ్రంజన్ సమక్షంలో ఆస్కీ రిజిస్ట్రార్ కల్యాణ్రాయ్, జేఎన్టీయూ రిజిస్ట్రార్ డాక్టర్ ఎం మంజూర్హుస్సేన్ ఒప్పంద పత్రాలపై సంతాలు చేశారు. కార్యక్రమంలో ఆస్కీ ప్రతినిధులు డాక్టర్ నిర్మల్యా బాగ్చి, డాక్టర్ వల్లీ, డాక్టర్ హర్ష్శర్మ, జేఎన్జీయూ రెక్టార్ డాక్టర్ ఏ గోవర్ధన్ పాల్గొన్నారు.
ఎంఎస్ఎంఈపై కొత్త పాలసీ