తాండూరు : టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని మంత్రి సబితారెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్లో మంత్రి సబితారెడ్డిని ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ తాండూరు పట్టణ అధ్యక్షుడు నయీం (అప్పు), తాండూరు మండల అధ్యక్షుడు రాందాస్, యాలాల మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, బషీరాబాద్ మండల అధ్యక్షుడు రాములునాయక్, పెద్దేముల్ మండల అధ్యక్షుడు కోహిర్ శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు.
తమపై నమ్మకంతో అధ్యక్షపదవులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ అభివృద్ధికి ప్రతి నిత్యం కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్గా బేధాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలన్నారు. పార్టీలో క్రమశిక్షణ లోపించకుండా జాగ్రత్తగ ఉండాలని సూచిస్తూ ఘనంగా సన్మానించారు.