పరిగి, ఏప్రిల్ 27: మహాత్ముడు చూపిన అహింసా మార్గం లో ఉద్యమ నాయకుడు, సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం పరిగిలోని తమ నివాసం వద్ద ఎమ్మెల్యే మహేశ్రెడ్డి టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా దేశానికే తలమానికంగా నిలిచే విధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని ఎమ్మె ల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి, ఎంపీపీ కె.అరవిందరావు, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, మాజీ ఎంపీపీ కె.శ్రీనివాస్రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆర్. ఆంజనేయులు, సీనియర్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, ఎ.సురేందర్కుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, నార్మాక్స్ డైరెక్టర్ పి.వెంకట్రాంరెడ్డి, కౌన్సిలర్లు నాగేశ్వర్రావు, వెంకటేశ్, టీఆర్ఎస్ నాయకులు బి.రవికుమార్, మొగులయ్య, యూసుఫ్ పాల్గొన్నారు.
బషీరాబాద్, ఏప్రిల్ 27: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ప్రసాద్, నాయకులు నర్సిరెడ్డి, రాజారత్నం, మాధవ్రెడ్డి, శ్రవన్కుమార్, అబ్దుల్ రజాక్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
కులకచర్ల,ఏప్రిల్27: కులకచర్ల మండల పరిధిలోని కులక చర్ల, చౌడాపూర్, మక్తవెంకటాపూర్ గ్రామాలతో పాటు ఇతర గ్రామాల్లో టీఆర్ఎస్ ఆవిర్భావదినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. కులకచర్ల మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సారా శ్రీనివాస్ టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. పార్టీ నాయకులు నర్సింలు, శేరి రాంరెడ్డి, హరికృష్ణ, మాలె కృష్ణగౌడ్, తిర్మలాపూర్ ఎంపీటీసీ రాంలాల్ పాల్గొన్నారు.
పెద్దేముల్, ఏప్రిల్ 27:సీఎం కేసీఆర్ నాయకత్వంలో బంగా రు తెలంగాణ దిశగా రాష్ట్రం అడుగులు వేస్తున్నదని ఎంపీపీ టి.అనురాధరమేశ్ అన్నారు. మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను నాయకుల,కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు టి.రమేశ్, శిబ్లి, విఠల్,జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు వెంకటేశ్ చారి, ఎంపీటీసీ శ్రీనివాస్,సర్పంచులు శ్రావణ్,పాండు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ప్రసాద్,పార్టీ నాయకులు రాందాస్, రహీం, మల్లేశం,హర్షవర్ధన్రెడ్డి పాల్గొన్నారు.