దౌల్తాబాద్ : మండలంలోని నందారంలో సీఆర్పీఎఫ్ బలగాలతో కొడంగల్ సీఐ అప్పయ్య ఆధ్వర్యంలో ఆదివారం పోలీసు కవాతు నిర్వహించారు. గ్రామంలోని వీధుల గుండా కవాతు చేశారు. వినాయక ఉత్సవాలను పురష్కరించుకొని పోలీస్ కవాతు నిర్వహించడం జరిగిందని సీఐ అప్పయ్య అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలని గ్రామ ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో కొడంగల్ ఎస్ఐ సామ్యానాయక్, దౌల్తాబాద్ ఏఎస్ఐ ఉస్మాన్, సిబ్బందితో పాటు నందారం గ్రామస్తులు, యువకులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.