శంకర్పల్లి : శంకర్పల్లి మండల రైతులు తాము సాగు చేస్తున్న పంటల వివరాలను సెప్టెంబర్ 5వ తేదీలోగా మండల వ్యవసాయాధికారి, మండల విస్తరణ అధికారులను కలిసి నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి కృష్ణవేణి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పంట వివరాలు వ్యవసాయ శాఖ అధికారుల వద్ద ఉంటే ప్రభుత్వం అందించే మద్దతు ధర రైతులకు లభిస్తుందన్నారు. పత్తి, కంది, మొక్కజొన్న, వరి పంటల సాగు వివరాలు, ఇతర పంటల సాగు వివరాలను తప్పనిసరిగా అందించాలని ఏఓ ఒక ప్రకటనలో కోరారు.