చేవెళ్ల టౌన్ : పేద ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుంటున్న మహానుభావుడు సీఎం కేసీఆర్ అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని పాల్గుట్ట గ్రామానికి చెందిన వాణి అనారోగ్యంతో నగరంలోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందు తుండటంతో మేరుగైన వైద్యం కోసం ఆమె కుటుంబ సభ్యులకు రూ. 3 లక్షల ఎల్ఓసి చెక్కును ఎమ్మెల్యే తన నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఏం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్యం కోసం ఖర్చుయ్యే డబ్బులను ముందుస్తు గానే ఎల్ఓసీ ద్వారా అందించి వారిని ఆదుకుంటున్నట్లు చెప్పారు.
ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. 70 సంవత్సరాల పాలనలో పేదలను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందన్నారు. గుంట భూమి ఉన్న రైతు ప్రమాదవాశత్తు మృతి చెందితే రైతు బీమాతో ఆ కుటుంబానికి రూ. 5లక్షలు ప్రభుత్వం అందజేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.