మహబూబ్నగర్ : బ్యాంకు ఉద్యోగులకు కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు తక్షణమే బ్యాంకులలో పని చేసే ఉద్యోగుల వివరాలను సమర్పించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావు ఎల్డీఎంను ఆదేశించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ రైతులు రైతుబంధు నిధులను పొందేందుకు బ్యాంకులలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ లో బ్యాంకు అధికారులు, డీఎంహెచ్ఓతో వాక్సినేషన్ ప్రక్రియపై సమీక్షించారు.
45 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడంలో భాగంగా ఫ్రంట్ లైన్ వర్కర్లు, సూపర్ స్ప్రెడర్లకు ఇది వరకే టీకాలు ఇచ్చామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్యాంకు ఉద్యోగులకు కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆయా బ్యాంకులలో పని చేస్తున్న సిబ్బంది వివరాలను సమర్పించాలన్నారు .
వానాకాలం సీజన్ కు సంబంధించి రైతులకు పంట రుణాలిచ్చేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. వచ్చే మంగళవారం (15 వ తేదీ) జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటలకు వానాకాలం కార్యాచరణ ప్రణాళికను విడుదల చేయనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
కార్యక్రమంలో ఎల్.డి.ఎం నాగరాజరావు, డీఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణ, ఎస్.బి.ఐ ఏజీఎం దినేశ్ గురునాథ్, యూనియన్ బ్యాంక్ డీజీఎం రమణ, జీవీవీ ఏజీఎం మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేద్దాం : ఎమ్మెల్యే ఆరూరి
పాలకుర్తిలో వ్యవసాయ, టాస్క్ఫోర్స్ అధికారుల విస్తృత తనిఖీలు
పుణె పరిశోధన : కరోనా కొత్త వేరియంట్ గుర్తింపు
సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సర్వే పనులకు శ్రీకారం
రెండు రోజుల్లో పెండింగ్ భూ సమస్యలు పరిష్కరించాలి