అనవసరంగా బయట తిరిగే వారిపై కఠినంగా వ్యవహరించాలి
వీసీలో రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 5 : జాతీయ విపత్తు వేళ పోలీసు శాఖ బాధ్యతలు మరింత పెరుగుతాయని, అందుకు తగ్గట్లుగా సంసిద్ధంగా ఉండాలని డీజీపీ ఎం.మహేందర్రెడ్డి సూచించారు. బుధవారం హైదరాబాద్లోని తన కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న రాత్రి పూట కర్ఫ్యూ గురించి ఆరా తీశారు. అనవసరంగా బయట తిరిగే వారిపై, మాస్కు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలోని శాంతిభద్రతల పరిస్థితి, రాత్రి పూట కర్ఫ్యూ, అమలు గురించి జిల్లా ఎస్పీ వివరించారు.
పోలీస్ స్టేషన్ల వారీగా ఏర్పాటు చేసిన పెట్రోలింగ్ బృందాల నిఘా మరింత విస్తృతంగా ఏర్పాటు చేయడం, పోలీసు కుటుంబాలకు వ్యాక్సిన్ వేయించడంతో పాటుగా కళా బృందం సభ్యులచే ప్రజలకు అవగాహన కార్యక్రమాల గురించి డీజీపీ సంతృప్తి వ్యక్తం చేశారు. వీసీలో ఎస్పీ అడ్మిన్ ఎన్.వెంకటేశ్వర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.