రైతుబంధు రాకతో మురిసిపోతున్న అన్నదాతలు
రైతుబంధు రాకతో మురిసిపోతున్న అన్నదాతలు
కరోనా కష్టకాలంలోనూ పెట్టుబడిసాయం అందించడంపై వెల్లువెత్తుతున్న ప్రశంసలు
ఏడాదికి ఎకరాకు రూ.10 వేల చొప్పున అందజేత
నాలుగేండ్లుగా కొనసాగుతున్న ‘సాయం’
రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికీ రూ.2,228 కోట్లు పంపిణీ
వికారాబాద్ జిల్లాలో రూ.2,211కోట్లు..
అప్పుల ఊబి నుంచి బయటపడిన రైతాంగం
రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/పరిగి, జనవరి 14:రైతుబంధు సాయం అందడంతో అన్నదాతలు సంక్రాంతి పండుగను రెట్టింపు ఆనందంతో జరుపుకొంటున్నారు. కరోనా కష్టకాలంలోనూ సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయం అందించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదికి ఎకరాకు రూ.10వేల చొప్పున ఎన్ని ఎకరాలున్నా పరిమితి లేకుండా సాయం అందుతున్నది. నాలుగేండ్లుగా నిరంతరాయంగా సమయానికి డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండడంతో రైతులు అప్పుల ఊబి నుంచి బయటపడ్డారు. పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు రంగారెడ్డి జిల్లాలో రూ.2228 కోట్లు పంపిణీ చేయగా.. వికారాబాద్ జిల్లాలో రూ.2211కోట్లు అందజేశారు. ఎన్ని అడ్డంకులొచ్చినా రైతు సంక్షేమ పథకాలు ఆపకుండా అమలు చేస్తున్న సీఎం కేసీఆర్కు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
ఉమ్మడి రం గారెడ్డి జిల్లాలోని రైతు కుటుంబాలకు రైతుబంధు సంబురం, సంక్రాంతి పండుగ ఒకేసారి వచ్చాయి. దీంతో రెట్టింపు ఉత్సా హంతో జరుపుకొంటున్నారు. యాసంగి సీజన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేయడంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. పైసా అప్పు లేకుండా యాసంగి పంటలను సాగు చేస్తూ ఊ రూరా రైతులు సంబురాలు చేసుకుంటున్నారు. ప్రతి ఏడాది పంట పెట్టుబడి నిమిత్తం సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్నదాతలకు ఆర్థిక సాయాన్ని అందిస్తుండటంపై వారు సంతోషం వ్య క్తం చేస్తున్నారు. ఒకప్పుడు వానకాలం, యాసంగి సీజన్లలో పంటల సాగు కోసం రైతులు అప్పుల కోసం వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసి, చేతికొచ్చిన దిగుబడితో అప్పులు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడిన పరిస్థితి నుంచి రూపాయి కూడా అప్పులేకుండా ధైర్యంగా సాగు చేసే స్థాయికి ఎదుగడం రైతుబంధు పథకంతోనే సాధ్యమైనది. ప్రభుత్వం విత్తనాలు, ఎరువులకు ఆర్థిక సాయం అందిస్తుండటంతో రైతులు సాఫీగా వ్యవసాయ పను లు చేసుకుంటున్నారు. గత నాలుగేండ్లుగా అమలుచేస్తున్న రైతుబంధు పథకంతో రైతులు అప్పుల ఊబి నుంచి పూర్తిగా బయటపడ్డారు. కొవిడ్ విజృంభణతో సమస్తం స్తంభించి ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం రాకపోయినా రైతులకు మాత్రం పెట్టుబడి సాయాన్ని అందించి సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా నిలిచారు.
పండుగలా వారోత్సవాలు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రైతుబంధు వారోత్సవాలు అంబరాన్నంటుతున్నాయి. జిల్లా అంతటా సంక్రాంతికి ముందే రైతుబంధు వారోత్సవాలతో పండుగ వాతావరణం నెలకొన్నది. రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు సాయం రూ.50 వేల కోట్లకు చేరడంతో టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో రైతుబంధు వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. వారోత్సవాల్లో భాగంగా రైతువేదికల అలంకరణ, విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు, మహిళలకు ముగ్గుల పోటీలు, రైతువేదికల వద్ద ఉత్తమ రైతులకు సన్మానాలు, టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి ఊరూరా అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను టీఆర్ఎస్ శ్రేణులు నిర్వహిస్తున్నారు. వారోత్సవాల్లో భాగంగా ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. రైతుబంధు వారోత్సవాల్లో మం త్రి సబితాఇంద్రారెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.
రంగారెడ్డి జిల్లాలో రూ. 2,228 కోట్ల సాయం
రైతుబంధు పథకం కింద గత నాలుగేండ్లలో టీఆర్ఎస్ ప్ర భుత్వం రూ.2,228 కోట్ల సాయాన్ని రంగారెడ్డి జిల్లాలోని రైతులకు పెట్టుబడి నిమిత్తం అందజేసింది. ఏడాదికి రెండు విడుతల్లో ఎకరానికి రూ. పది వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులను జమ చేస్తున్నది. 2018 వానకాలం సీజన్లో 2,47,688 మంది రైతులకు రూ.257 కోట్లు, యాసంగిలో 2,21,096 మంది రైతులకు రూ.240 కోట్లు, 2019 వానకాలంలో 2,30,155 మంది రైతులకు రూ.257 కోట్లు, యాసంగిలో 1,87,804 మంది రైతులకు రూ.182 కోట్లు, 2020 వానకాలంలో 2,69,022 మంది రైతులకు రూ.342 కోట్లు, యాసంగిలో 2,74,785 మంది రైతులకు రూ.344 కోట్లు, 2021 వానకాలం సీజన్లో 2,82,094 మంది రైతులకు రూ.343 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేసింది. అయితే యాసంగి సీజన్కు సంబంధించి ఇప్పటివరకు రూ.277 కోట్లను అందజేసింది. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు ఏడెకరాల భూమిగల 2,84,684 మంది రైతులు పెట్టుబడి సాయాన్ని పొందగా, జిల్లాలో యాసంగి సీజన్కు 3,48,556 మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా అధికారులు గుర్తించారు.
వికారాబాద్ జిల్లాలో రూ.2,211 కోట్లు..
రైతుబంధు పథకం ద్వారా వికారాబాద్ జిల్లాలో 8 విడుతల్లో రూ.2211.5 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యా యి. 2018 వానకాలం సీజన్లో ఎకరాకు రూ.4 వేల చొప్పు న.. యాసంగి సీజన్కు సంబంధించి ఎకరాకు రూ.4వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. 2019 నుంచి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎకరాకు ఒక్కో సీజన్కు రూ. 5 వేల చొప్పున రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నది. ఈ లెక్కన 2018 వానకాలంలో 2,25,215 మందికి రూ. 244.02 కోట్లు, 2018 యాసంగిలో 1,99,594 మందికి రూ.227.17 కోట్లు, 2019 వానకాలంలో 2,07,652 మంది రైతులకు రూ.293.44 కోట్లు, 2019 యాసంగిలో 1,87,707 మందికి రూ.258.76కోట్లు, 2020 వానకాలంలో 2,24,954 మందికి రూ.307.63కోట్లు, 2020 యాసంగిలో 2.30,639 మందికి రూ.310.61కోట్లు, 2021 వానకాలంలో 2,39,926 మందికి రూ.311. 57కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఈసారి యాసంగిలో 2,57,148 మంది రైతులకు రూ. 318.2కోట్లు మంజూరు కాగా గురువారం నాటికి 2,30, 992 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.259,200,1432 జమయ్యాయి.
సకాలంలో రైతుబంధు సాయం..
రైతులు పంటను సాగు చేసుకునేందుకు ప్రభుత్వం ప్రతి ఏడాది పెట్టుబడి సాయాన్ని సకాలంలో అందిస్తున్నది. గతంలో వ్యవసాయం చేసేందుకు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. రైతుకు ఏ సమయంలో ఎటువంటి సాయా న్ని అందించాలో రైతు బిడ్డ సీఎం కేసీఆర్కు బాగా తెలుసు. కాబట్టే రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని సౌకర్యాలు, సంక్షేమ ఫలాలను అందించి రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు.
-గడ్డమీది రాములు, రైతు, చిన్ననందిగామ