మర్పల్లి, ఆగస్టు : గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేయించాలని జిల్లా పశుసంవర్ధక, పశువైద్యాధికారి డాక్టర్ అనిల్కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని సిరిపురం, కల్ఖోడా, పట్లూర్ గ్రామాలలో 482 గొర్రెలు, 1419 మేకలకు నట్టల మందులు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొర్రెలు, మేకలలో ఏలికపాములు, బద్దెపురుగులు, లివర్ప్లూక్ మొదలగు అంతర్ పరాన్న జీవుల వల్ల అనేక అనర్థాలు సంభవించి, గొర్రెలు, మేకల పెంపకం దార్లు సుమారు 30 శాతం ఆదాయం కోల్పోతున్నారన్నారు.
అందుకు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్ననట్టల నివారణ మందులను గొర్రెలు, మేకలకు తాగించి రైతులు లబ్ధి పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లయ్య, మర్పల్లి పశువైద్యాధికారిణి విజయలక్ష్మి, డాక్టర్లు నరేంద్రనాథ్రెడ్డి, హరిప్రియ, సిబ్బంది కుమార్, శ్రీనివాస్, ప్రభు, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.