పరిగి, ఆగస్టు : ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పరిగిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విష్ణు, లలిత, గోవింద నామాలు, హనుమాన్ చాలీసా పఠనం 108వ వారాన్ని పురస్కరించుకొని పారాయణ సంకల్పం నిర్వహించారు.
కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్రెడ్డి మాట్లాడుతూ ఆలయంలో 108 వారాలపాటు పారాయణం కొనసాగించడం ద్వారా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందని చెప్పారు. ఆధ్యాత్మిక చింతనతో ప్రతి ఒక్కరికీ ప్రశాంతత లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజ్కుమార్ భక్త బృందాన్ని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో హరీశ్వర్రెడ్డి సతీమణి గిరిజాదేవి, జెడ్పీటీసీ బి.హరిప్రియ, ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్పీ బాబయ్య, బి.ప్రవీణ్కుమార్రెడ్డి, మాజీ సర్పంచ్ సిద్దాంతి పార్థసారథి, భక్తులు పాల్గొన్నారు.