కొడంగల్: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పెన్షన్ పథకానికి 57 ఏండ్లు పైబడిన వాళ్లు దరఖాస్తు చేసుకోవాలని, అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయని ఎంపీడీవో మోహన్లాల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్ ద్వారా మీసేవా కేంద్రాల్లో ఈనెల 31వ తేదీ లోపు ధరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.