ఇప్పుడు ఎక్కడ చూసినా కోతులే కనిపిస్తున్నాయి. అడవులను వదిలేసి.. ఊళ్లలో పడి తిరుగుతున్నాయి కోతులు. ఊళ్లో ఏది కనిపిస్తే దాన్ని తినేయడం.. ఇళ్లలోకి దూరడం.. ఎవరు కనిపిస్తే వాళ్లపైకి దాడి చేయడం.. పంట పొలాలను నాశనం చేయడం.. ఇలా కోతులు చేయని చేష్టలు లేవు.
తాజాగా ఓ కోతి ఊళ్లోకి వచ్చి జనాలపై దాడి చేసింది. ఈ ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన కర్ణాటకలోని బీదర్ జిల్లాలో చోటు చేసుకుంది. హుమానాబాద్ తాలుకాలోని గోద్వాడి అనే గ్రామంలోకి వచ్చన ఓ కోతి రచ్చ రచ్చ చేసింది. జనాలపై దాడి చేసింది. ఆ తర్వాత దాన్ని తరిమికొట్టేందుకు గ్రామస్థులు పటాసులు పేల్చినా అది ఊరిని మాత్రం వదిలిపెట్టలేదు. దీంతో వెంటనే అటవీ సిబ్బందికి సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న సిబ్బంది దాన్ని పట్టుకొని తీసుకెళ్లి అడవిలో వదిలేశారు. కోతి దాడిలో గాయపడిన వారిని అక్కడి లోకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Spider inside Woman’s Ear : మహిళ చెవిలో దూరిన సాలీడు..
70 ఏళ్ల వయసులో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వృద్ధురాలు..
Viral Video : ప్రపంచంలోనే అత్యంత పెద్ద పాము.. దీన్ని మోయడానికి క్రేన్నే తీసుకొచ్చారు
Driverless bike : డ్రైవర్లెస్ బైక్ వచ్చేసింది.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో చూశారా?
విమానం నుంచి పడిపోయిన మానవ వ్యర్థాలు.. షాకైన తోట యజమాని