అందరి జీవితం ఒకేలా ఉండదు. కానీ.. జీవితం మనకు చాలా అవకాశాలను ఇస్తుంది. జీవితంలో ఎదిగేందుకు ఏదో ఒక రూపంలో చాన్సెస్ వస్తుంటాయి. వాటిని అందిపుచ్చుకుంటావా? లేక వదిలేస్తావా? అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. అలా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని.. నేడు గిన్నిస్ బుక్లోకి ఎక్కిన ఓ వ్యక్తి గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం.
అతడి పేరు మహమ్మద్ అలీ అహ్మద్. బెంగళూరుకు చెందిన అలీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను సాధించాడు. ప్రపంచంలోనే అత్యధిక మూడు డిజిట్ల ఫ్లాష్ నెంబర్లను గుర్తుపెట్టుకొని అలీ ఈ రికార్డు సాధించాడు.
కరోనా మహమ్మారి ఈ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన విషయం తెలుసు కదా. అలాగే.. అలీ కూడా కరోనాతో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కరోనా సమయంలో పనులు లేక చాలా కష్టాలు పడ్డాడట. తనకు 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడట. డిప్రెషన్లోకి వెళ్లాడట. అప్పుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డాడట. ఇలా.. ఎన్నో సమస్యలను ఎదుర్కొని.. కష్టాలకు ఎదురీది చివరకు గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించాడు అలీ.
అక్టోబర్ 18 న ఈ ఫీట్ సాధించి శభాష్ అనిపించుకున్నాడు అలీ. కరోనా మహమ్మారి తన జీవితాన్నే మార్చేసిందని.. ఏదో ఒకటి సాధించేలా ఉసికొల్పిందని అలీ చెప్పుకొచ్చాడు.
ఇప్పటి వరకు అత్యధిక మూడు సంఖ్యల నెంబర్లు ఉన్న కార్డులను గుర్తుపెట్టుకొని గిన్నిస్ బుక్లో ఇరాన్కు చెందిన ఓ వ్యక్తి స్థానం సంపాదించాడు. అతడు కేవలం 30 ఫ్లాష్కార్డులను మాత్రమే గుర్తుపెట్టుకోగలిగాడు. కానీ.. అలీ మాత్రం 32 ఫ్లాష్కార్డ్స్ను గుర్తుపెట్టుకొని ఇరాన్ రికార్డును బద్దలు కొట్టాడు.
ఈ రికార్డులో భాగంగా.. అలీకి వరుసగా కొన్ని ఫ్లాష్కార్డ్స్ను చూపించారు. అవి 32 ఉంటాయి. ఒక్కో కార్డులో మూడు నెంబర్లు ఉంటాయి. ఒక్కో కార్డును ఒక సెకన్ పాటు చూపిస్తారు. అలా.. వరుసగా 32 కార్డులను చూపిస్తారు.
32 కార్డులను చూపించడం పూర్తయ్యాక.. అదే వరుసక్రమంలో.. మొదటి కార్డులో ఉన్న నెంబర్ల నుంచి చివరి కార్డులో ఉన్న నెంబర్లను కరెక్ట్గా చెప్పాల్సి ఉంటుంది. అలా 32 కార్డుల్లో ఉన్న నెంబర్లను కరెక్ట్గా చెప్పి అలీ అహ్మద్ ఈ రికార్డును సృష్టించాడు.
తన వృత్తి పరంగా.. అలీ అహ్మద్.. స్టూడెంట్స్కు మెమోరీ టెక్నిక్స్ నేర్పిస్తుంటాడు. భావోద్వేగాలు, యాంగ్జయిటీని ఎలా కంట్రోల్ చేసుకోవాలి.. లాంటి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి విద్యార్థులు, ప్రొఫెషనల్స్కు ట్రెయినింగ్ ఇస్తుంటాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
OTT | 2008లోనే భారత్లో ఓటీటీ వచ్చిందా? డిజిటల్ ఫ్లాట్ఫామ్స్తో లాభమా? నష్టమా?
mini bengal | తెలంగాణలో మినీ బెంగాల్.. కట్టుబొట్టూ అంతా ఉత్తరాది స్టైలే !!
లక్షల విలువ చేసే గోల్డ్ నెక్లెస్ను మింగిన ఆవు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
70 ఏళ్ల వయసులో రోడ్డు పక్కన ‘పోహా’ అమ్ముతూ జీవనం.. ఈ వృద్ధ జంట కష్టాలు తెలిస్తే కన్నీళ్లాగవు