70 ఏళ్ల వయసు ఉన్నవాళ్లు రోడ్డు మీదికి వచ్చి ఏదైనా పనిచేస్తారా. 60 ఏళ్లు దాటితేనే ఈరోజుల్లో ఎవ్వరూ ఇల్లు దాటరు. రెస్ట్ తీసుకుంటారు. కొందరి శరీరం బయటికి రావడానికి కూడా సహకరించదు. 60 ఏళ్లు దాటితే వాళ్లను పిల్లలే సాదాలి. వాళ్లను కష్టపెట్టకుండా చూసుకోవాలి. కానీ.. మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన ఈ వృద్ధ జంట మాత్రం 70 ఏళ్ల వయసులో కూడా కష్టపడాల్సి వస్తోంది. మూడు పూటలా కడుపు నిండా అన్నం తినాలంటే.. ఉదయం నుంచి రాత్రి వరకు.. పని చేయాల్సి వస్తోంది. ఒక్క రోజు పనిచేయకపోయినా పస్తులు ఉండాల్సిన పరిస్థితి వాళ్లది.
నాగ్పూర్లో రోడ్డు పక్కన ఈ జంట నాగ్పూర్ స్పెషల్ నాస్టా తర్రి పోహాను అమ్ముతూ తమ బతుకుబండిని లాగుతున్నారు. అది కూడా కేవలం 10 రూపాయలకే ప్లేట్ పోహాను అమ్ముతున్నారు. గత నాలుగేళ్ల నుంచి రోడ్డు పక్కన పోహా అమ్ముతూ ఈ వయసులో కూడా తమ కాళ్ల మీద నిలబడుతున్న ఆ జంటను చూసి అక్కడి స్థానికులు వాళ్లకు హ్యేట్సాఫ్ చెబుతున్నారు.
వీళ్ల కష్టాన్ని చూసిన ఓ ఫుడ్ వ్లాగర్ వాళ్ల స్టోరీని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేయడంతో వాళ్ల స్టోరీ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి పోహా, ఆలూ బోండాను అమ్మితేనే ఆరోజుకు వాళ్ల కడుపు నిండుతుంది. ఆ వీడియోను ఇన్స్టాలో అప్లోడ్ చేయగానే.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు కూడా ఆ వృద్ధ జంటను చూసి శభాష్ అంటున్నారు. నాగ్పూర్లో ఉండే నెటిజన్లు.. ఆ జంటకు ఏదైనా సాయం చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ల ఫుడ్ స్టాల్ బాగా నడిచేందుకు తమ వంతు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కూతుళ్లకు టీ ఎలా చేయాలో నేర్పించిన యూఎస్ ఫేమస్ డాక్టర్ సంజయ్ గుప్తా: వీడియో వైరల్
Anand Mahindra : 900 మంది ఉద్యోగులను జూమ్ కాల్లో తీసేసిన ఘటనపై ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే?
Bipin Rawat : బిపిన్ రావత్కు ఘనమైన నివాళి.. దేశమంతా సెల్యూట్: వీడియో వైరల్