ఆహారపు కొరత అనేది రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాకు సరిపోయే ఆహారం ఇప్పుడు లేదు. అందుకే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. భవిష్యత్తు తరాలకు ఆహారపు కొరత ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. ఆహారపు కొరతతో పాటు.. ఆహారం వృథా అవడం కూడా చూస్తూనే ఉన్నాం. ఆహారాన్ని చాలామంది వృథా చేస్తున్నారు. పండిన పంటలో సగం నేలపాలు అవుతోంది. వృథా అవుతోంది. ఆహారపు వృథాను అరికట్టగలిగితే.. భవిష్యత్తులో ఆహారం కొరత ఏర్పడదు. దాన్ని లీడ్గా తీసుకొని ఆహారం వృథాపై అందరికీ అవగాహన కల్పించడం కోసం గుజరాత్లోని వడదొరాకు చెందిన రాధికా సోని అనే మహిళ బిస్కెట్ ప్యాకెట్లతో గణనాథుడిని అలంకరించింది.
మా ఇంట్లోనే జరిగిన ఓ ఫంక్షన్లో ఆహారం చాలా వృథా అయింది. అలా వృథా అవుతున్న ఆహారాన్ని ఎవరికైనా డొనేట్ చేద్దామన్నా కుదరలేదు. అసలు ఆహారం అనేది వృథా చేయాల్సింది కాదు.. కానీ ప్రతి రోజు మూడోవంతు ఆహారం వృథా అవుతోంది. ఆహారాన్ని వృథా చేయకండి.. అని ప్రజల్లో అవగాహన కల్పించడం కోసమే వినాయకుడిని ఇలా ఫుడ్ ప్యాకెట్లతో అలంకరించా.. అని చెప్పింది రాధిక.
బిస్కెట్ ప్యాకెట్లతో ముందు శివలింగాన్ని తయారు చేసి..ఆ శివలింగం మధ్యలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. 1008 బిస్కెట్ ప్యాకెట్లు, 850 రుద్రాక్షలను ఉపయోగించి.. 5 అడుగుల శివలింగాన్ని తయారు చేసింది రాధిక. గణపతిని నిమజ్జనం చేసిన తర్వాత ఈ బిస్కెట్ ప్యాకెట్లను పేద పిల్లలకు పంచుతానని రాధిక వెల్లడించింది.
ఇక.. రాధిక ఆలోచనను అక్కడి స్థానికులు తెగ మెచ్చుకుంటున్నారు. ఫుడ్ ప్యాకెట్స్తో రాధిక డెకరేట్ చేసిన వినాయకుడిని చూడటానికి అక్కడి స్థానికులు ఎగబడుతున్నారు. ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సీతాకోక చిలుకకు ప్రాణం పోసిన మహిళ.. వీడియో వైరల్
Viral Video : పెళ్లి కాగానే.. వధువు ఆశీర్వాదం తీసుకున్న వరుడు.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
Viral Video : అక్కడ జరిగింది ట్రక్ యాక్సిడెంట్.. కానీ ఈ వీడియో చూసి నవ్వు ఆపుకోలేరు