లోక్సభ ఎన్నికలపై అవగాహన పెంచడానికి, ఓటింగ్ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం వినూత్న ప్రచారాన్ని చేపట్టింది.
ఢిల్లీలోని ప్రఖ్యాత చారిత్రక కట్టడం ‘కుతుబ్ మినార్’పై త్రివర్ణ పతాకం, పార్లమెంట్ భవనం, ఎన్నికల సంఘం లోగోతోపాటు ఎన్నికలకు సంబంధించిన అంశాలను విద్యుత్తు వెలుగుల్లో ఇలా ప్రదర్శించింది.