న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో ముంబై నార్త్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థిని బీజేపీ శనివారం మార్చింది.
సిటింగ్ ఎంపీ పూనమ్ మహాజన్ను మొదట ఈ స్థానం నుంచి నిలిపినప్పటికీ, ఆమెకు బదులుగా ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్కు టికెట్ ఇచ్చింది. పూనమ్ 2014, 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు.