అసలు జంతువులను రైళ్లలో ప్రయాణానికి అనుమతిస్తారా? ఇది అందరికీ ఉండే అనుమానమే? జంతువులు అంటే మనం పెంచుకునే కుక్కలు, పిల్లలు గట్రా ఏవైనా ఉంటే.. ఎటైనా వెళ్తున్నప్పుడు మనతో పాటు వాటిని కూడా తీసుకెళ్లాలని అనుకుంటాం. కానీ.. రైళ్లలో, బస్సుల్లో పెట్ డాగ్స్ను అనుమతించరు. కానీ.. ఇటీవల.. తన పెంపుడు కుక్క కోసం ఓ వ్యక్తి ఏకంగా విమానంలోని బిజినెస్ క్లాస్ మొత్తం బుక్ చేసినట్టు విన్నాం కదా. అలాగే.. మరో వ్యక్తి ఇటీవల తన పెంపుడు కుక్కను ముంబై నుంచి భువనేశ్వర్ వరకు రైలులో తీసుకెళ్లాడు. అంతే కాదు. దానికి ట్రెయిన్ జర్నీకి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
నిజానికి రైల్వేస్లో పెట్ డాగ్స్కు అనుమతి ఉంది. కాకపోతే వాటిని కేవలం ఫస్ట్ క్లాస్ ఏసీలో మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ మొత్తం డాగ్ ఓనర్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న కుక్క పిల్లలు అయితే వాటి కోసం కొన్ని కంపార్ట్మెంట్లలో బాక్స్లు ఉంటాయి. ఫుడ్ కూడా డాగ్స్ ఓనర్సే తెచ్చుకోవాల్సి ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Raw Meat : మూడేండ్ల నుంచి పచ్చి మాంసమే అతడి ఆహారం.. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?
Squid Game : రియల్ లైఫ్లో స్క్విడ్ గేమ్ ఆడాలని ఉందా? అయితే అక్కడికి వెళ్లాల్సిందే?
అదానీ నిమిషానికి ఎంత సంపాదిస్తాడో తెలుసా? సగటు వ్యక్తి జీవితకాలం కష్టపడినా అంత రాదు!!
కోట్లు సంపాదించి.. తన కంపెనీ ఉద్యోగులను కోటీశ్వరులుగా మార్చాడు