ఈరోజుల్లో ఇల్లు కట్టడం అంటే మామూలు విషయమా చెప్పండి. లక్షలు కుమ్మరించాలి.. నెలలకు నెలలు సమయం కేటాయించాలి.. అన్నీ సక్రమంగా జరిగితే.. ఇల్లు పూర్తవుతుంది. చిన్న ఇల్లు కట్టాలన్నీ.. నేడు లక్షలకు లక్షలు పెట్టాల్సిన పరిస్థితి. ఈనేపథ్యంలో ఓ కుటుంబం మాత్రం రెండు కోట్ల రూపాయల విలువ ఉన్న ఇంటిని కేవలం రూ.100 కే అమ్మేస్తున్నారు. చాలా విచిత్రంగా ఉంది కదా.. 100 రూపాయలకు కిలో టమాటాలు కూడా రావు. అంత పెద్ద ఇల్లును ఎలా ఇస్తున్నారు అనే కదా మీ డౌట్. పదండి ఓసారి ఇంగ్లండ్ వెళ్లి వద్దాం.
ఇంగ్లండ్లోని సౌత్ టైన్సైడ్లో ఉండే ఓ ఫ్యామిలీకి రెండు ఫ్లోర్ల బిల్డింగ్ ఉంది. అందులో మూడు బెడ్రూమ్స్, ఒక గార్డెన్ కూడా ఉంది. కింద పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. అలాగే.. అక్కడ ఉండే బీచ్కు చాలా దగ్గర.
ఆడమ్ థ్వైటస్, అతడి భార్య లిజ్ వేరే ప్రాంతానికి వెళ్లి సెటిల్ అవ్వాలనుకున్నారు. వాళ్ల వర్క్, చారిటీ, వాళ్ల కూతరు స్కూల్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తమ ఇంటిని అమ్మేద్దామనుకున్నారు.
అయితే.. లిజ్.. గ్రేస్ హౌస్ అనే ఓ చారిటీ కోసం పనిచేస్తుంటుంది. అంగవైకల్యం ఉన్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన చారిటీ అది. పిల్లలకు ఆడుకోవడానికి ప్లే ఏరియాను ఏర్పాటు చేయాలని లిజ్ భావించింది. కానీ.. దాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం రూ.13 లక్షలు ఖర్చు అవుతాయి. అంత డబ్బు తన దగ్గర లేకపోవడంతో.. ఎలాగైనా వాళ్లు వేరే ప్రాంతానికి షిఫ్ట్ అవ్వాలని అనుకున్నారు కాబట్టి ఇంటిని అమ్మేయాలనుకున్నారు కానీ.. ఇంటిని అమ్మడం కోసం లాటరీ విధానాన్ని తీసుకొచ్చారు.
దాని కోసం 200,000 లాటరీ టికెట్లను సమకూర్చి.. ఒక్కో టికెట్ను రూ.100 రూపాయలకు అమ్మడం ప్రారంభించారు. క్రిస్మస్ రోజు లక్కీ డ్రా తీసి.. లాటరీ టికెట్ కొన్నవాళ్లలో ఒకరికి ఆ ఇంటిని ఇచ్చేయనున్నారు. అంటే.. 100 రూపాయలు పెట్టి టికెట్ కొంటే.. 2 కోట్ల విలువైన ఇల్లు లక్కీ విన్నర్కు సొంతం కానుంది. అలాగే.. చారిటీ కోసం కూడా నిధులను సేకరిస్తోంది ఆ ఫ్యామిలీ. చారిటీ కోసం మరో 50 లక్షలను సేకరించడమే టార్గెట్గా పెట్టుకున్నారు. ఇప్పటికే కొన్ని టికెట్లు అమ్ముడుపోయాయట. క్రిస్మస్ వరకు 2 లక్షల టికెట్లు అమ్ముడుపోతే.. క్రిస్మస్ రోజే బంపర్ డ్రా తీసి.. లక్కీ విన్నర్కు తమ ఇంటి కీని అందించేందుకు ఆ ఫ్యామిలీ సిద్ధమవుతోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Hyderabad | లాక్డౌన్ టైమ్లో ప్రాణాలకు తెగించి సేవలందించారు.. నోబెల్కు నామినేట్ అయ్యారు
హైదరాబాద్లో బడ్జెట్ ధరలో టేస్టీ దోశ, ఇడ్లీ తినాలంటే.. అక్కడికి వెళ్లాల్సిందే
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం అదే.. పారిస్ కూడా దాని తర్వాతే!
మట్టితో ఇంటిని నిర్మించాడు.. ఆ ఇల్లు స్పెషాలిటీ ఏంటో తెలుసా?
డ్రైవర్లకు పోలీసుల ‘గరమ్ చాయ్’.. ఎందుకంటే?