14 ఏళ్ల పిల్లాడు రోడ్డు మీద ఫుడ్ అమ్ముతున్నాడంటే.. అతడి ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే.. ఆ బాలుడిని ఆదుకోవాలంటూ నెటిజన్లు కోరుతున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన ఓ బాలుడు.. మణినగర్ రైల్వే స్టేషన్ సమీపంలో దహీ కచోరీ బండి పెట్టుకున్నాడు. చదువుకునే వయసులో ఈ పని ఏంటి.. మీ అమ్మానాన్న ఏం చేస్తారు.. అని అక్కడి స్థానికులు ఆ బాలుడిని అడిగారు. దీంతో తన ఆర్థిక పరిస్థితి గురించి అక్కడి వాళ్లకు చెప్పాడు.
అక్కడ కచోరీ తినడానికి వెళ్లిన విశాల్ పరేఖ్ అనే వ్యక్తి ఆ బాలుడి పరిస్థితిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. దయచేసి అక్కడి స్థానికులు ఆ బాలుడిని ఆదుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియోను చూసిన అక్కడి స్థానికులు ఆ బాలుడి కచోరీ బండి వద్దకు వెళ్లి కచోరీలు తిని గిరాకీ చేస్తున్నారు. దీంతో ఆ బాలుడు ఫుల్ ఖుషీ అవుతున్నాడు. వీడియో వైరల్ అవ్వడం వల్లే రోజూ గిరాకీ పెరుగుతోందని ఆ బాలుడు చెప్పుకొచ్చాడు.
Kulhad Pizza : మట్టి ముంతలో పిజ్జా.. దీన్ని ఒక్కసారి తిన్నారంటే వదల్లేరు
Viral Photo : ఈ ఫ్రిడ్జ్ అమ్మబడును.. అసలు ఈ ఫోటోలో ఫ్రిడ్జ్ ఉందా? కనిపెట్టండి చూద్దాం
Viral Video: కాఫీ డోర్ డెలివరీ చేయడానికి వెళ్తున్న డ్రోన్పై కాకి దాడి
Viral Video : గుడిలో ఏనుగు బీభత్సం.. దాని మీదికి ఎక్కిన వ్యక్తిని కిందపడేసి