వంద ఏళ్లు కాదు.. రెండువందల ఏళ్ల క్రితం నాటిది కాదు… సుమారు 4500 ఏళ్ల క్రితం నాటి సూర్య దేవాలయాన్ని పురావస్తుశాఖ అధికారులు గుర్తించారు. ఆ దేవాలయం ఈజిప్ట్లో ఉంది. ఈజిప్ట్ను ఒకప్పుడు ఫారోహ్ అనే రాజులు పాలించేవారు. వాళ్ల హయాంలోనే ఈజిప్ట్లో పలు సూర్యదేవాలయాలను నిర్మించారు. అయితే.. వాటిని ఎక్కడ నిర్మించారు.. వాటి ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు తెలియలేదు. అప్పటి వరకు ఒక దేవాలయం ఆచూకీ తెలియగా.. ఇప్పుడు రెండోదాని ఆచూకీ లభించింది.
ఈజిప్ట్లోని అబు ఘురబ్లో ఈ దేవాలయం ఉంది. ప్రస్తుతం ఆ గుడి పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నప్పటికీ.. అందులోని కొన్ని వస్తువులను మాత్రం అధికారులు వెలికి తీయగలిగారు. ఫారోహ్ పాలనలో నిర్మించిన ఆరు సూర్యదేవాలయాల్లో ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చింది రెండే. అప్పట్లో సూర్య దేవాలయాలను మట్టితో చేసిన ఇటుకలు, సున్నపు రాళ్లను పిల్లర్లుగా చేసి నిర్మించారు.
నిజానికి.. ఆ ప్రాంతంలో స్టోన్ టెంపుల్ ఉండేది. ఆ టెంపుల్ను తవ్వితే.. దాని కింద సూర్యదేవాలయం ఆనవాళ్లు కనిపించాయి. 1898 లో ఒకసారి సూర్యదేవాలయాన్ని అధికారులు కనిపెట్టగా.. తాజాగా రెండో సూర్యదేవాలయాన్ని గుర్తించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Bull : ఈ ఎద్దు విలువ రూ. కోటి.. కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఆ బామ్మ వయసు 105 ఏళ్లు.. అయినా పరుగుపందెంలో పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించింది