యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తజనంతో కోలాహలంగా మారింది. సెలవు దినం, శ్రావణమాసం ముగుస్తుండడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆలయంలోని వివిధ విభాగాల క్యూలైన్లు, కొండపై పరిసరాలు, ఘాట్ రోడ్డు కాలు పెట్టడానికి వీలులేకుండా భక్తులుతో నిండిపోయాయి.
రూ.150 క్యూలైన్లు నిండి భక్తులు బయటకు బారులుదీరారు. ప్రసాద విక్రయశాల క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు. హోటల్, దుకాణాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. దర్శనానికి 6 నుంచి 7గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు.
ఉదయం నుంచే భక్తుల రాక మొదలు..
శ్రావణ మాసం ముగుస్తుండడం సెలవుదినం కూడా కావడంతో ఉదయం నుంచే భక్తుల తాకిడి మొదలైంది. భక్తుల రద్దీ దృష్ట్యా కొండపైకి ఎలాంటి వాహనాలను అనుమతించలేదు. దీంతో భక్తులు కాలినడకన, ఆటోల్లో కొండపైకి చేరుకున్నారు. ద్విచక్ర వాహనాలు రెండో ఘాట్రోడ్డు మూలమలుపు వరకు పార్కింగ్ చేశారు. కొండకింద పార్కింగ్, టెంపుల్ సిటీ ఘాట్రోడ్డు పూర్తిగా కార్లతో నిండిపోయింది. కొండ కింద చెక్పోస్టు వద్ద ఘాట్రోడ్డు ప్రారంభంలో ట్రాఫిక్ పోలీసులు తమ సిబ్బందితో కలిసి పరిస్థితిని చక్కదిద్దారు.
అయినా భక్తులు స్వామి దర్శనం అనంతరం చెక్పోస్టు నుంచి బస్టాండ్ చేరుకోవడానికి 45 నిమిషాల సమయం పట్టిందని తెలిపారు. శ్రావణ మాసంలో ముగుస్తుండడంతో సత్యనారాయణ వ్రత మాచరించడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. యాదాద్రి కొండకింద గల పాత గోశాల వద్ద వ్రత మండపం, పాతగుట్టలో వ్రత మండపంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వ్రత మాచరించారు.
ఇవి కూడా చదవండి..
Good news | మెట్రో రైలు సేవలు మరో అరగంట పొడిగింపు
Bigg boss: ఇక్కడ టన్నుల కొద్ది కిక్ వస్తుంది.. బిగ్ బాస్ ప్రోమో విడుదల
విద్యతోనే మానవ వనరుల అభివృద్ధి: మంత్రి హరీశ్ రావు