యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి ఖజానాకు శనివారం రూ.10,01,568 ఆదాయం వచ్చినట్లు ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా 1,31,006, రూ.100 దర్శనం టిక్కెట్ ద్వారా 31,900, వీఐపీ దర్శనాలతో 90,000, వేద ఆశీర్వచనం ద్వారా 3,612, నిత్య కైంకర్యాల ద్వారా 4,402, క్యారీ బ్యాగుల విక్రయం ద్వారా 3,000, వ్రత పూజలతో 41,000, కళ్యాణకట్ట టిక్కెట్ల ద్వారా 19,200, ప్రసాద విక్రయం ద్వారా 4,31,335,
వాహన పూజలతో 9,200, టోల్గేట్ ద్వారా1,220, అన్నదాన విరాళం ద్వారా 7,049, సువర్ణ పుష్పార్చన ద్వారా 1,20,680, యాదరుషి నిలయం ద్వారా 54,180, పాతగుట్ట నుంచి 13,320, ఇతర విభాగాల ద్వారా 13,784 ఆదాయం లభించింది. మొత్తంగా శ్రీవారి ఖజానాకు రూ.10,01,568 ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు.