హైదరాబాద్ : తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తినిఓ మహిళ దారుణంగా హతమార్చింది(Woman killed) . ఈ విషాదకర సంఘటన భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri district) జిల్లా ఇల్లందు మండలం వజ్జవారిగూడెంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శ్రీను(48), సరిత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కాని మద్యం మత్తులో ఉన్న శ్రీను సరిత ఉరేసి(Hanging) చంపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.