Tummala Nageswara Rao | హైదరాబాద్, మే 15(నమస్తే తెలంగాణ): వరి కొయ్యలు కాల్చే రైతులకు జరిమానా విధించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం పలు అంశాలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి రైతుకు పంటల బీమా ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని, విధి విధానాలు రూపొందించాలని పేర్కొన్నారు. మొదటి విడత పంటనష్ట పరిహారం రూ.15 కోట్లు పంపిణీ పూర్తయినందున, రెండోవిడత (ఏప్రిల్), మూడోవిడత (మే) జరిగిన పంట నష్ట వివరాలను వేగంగా అందించాలని పేర్కొన్నారు.
పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి ఈ నెలాఖరుకు రిపోర్ట్ వచ్చేలా చూడాలని కోరారు. మార్ఫెడ్ ద్వారా మక, జొన్న, పొద్దుతిరుగుడు కొనుగోళ్లను వేగవంతం చేసి ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సభ్యుల గుర్తింపు, పదవీకాలం ముగిసిన సహకార సంఘాలకు సత్వరమే ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.